Tirumala Temple Closed: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 28న శ్రీవారి ఆలయం మూసివేత.. నేడు ఎస్ఎస్డీ టోకెన్ల రద్దు.. కారణం ఇదే!
ఈ నెలాఖరులో తిరుమల దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులకు అలర్ట్. 29న తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం 8 గంటలపాటు మూతపడనుంది.
Tirumala, Oct 2: ఈ నెలాఖరులో తిరుమల (Tirumala) దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులకు అలర్ట్. 29న తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం (Lunar Eclipse) కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం (Srivari Temple) 8 గంటలపాటు మూతపడనుంది. 29న తెల్లవారుజామున 1.05 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 2.22 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ కాబట్టి 28న రాత్రి 7.05 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి 3.15 గంటలకు శుద్ధి చేసి సుప్రభాత సేవల అనంతరం ఆలయాన్ని తెరుస్తారు. ఆ తర్వాతి నుంచి యథావిధిగా భక్తులను అనుమతిస్తారు.
ఈ ప్రత్యేక సేవలు రద్దు
సహస్ర దీపాలంకార సేవ, దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శనం 28న రద్దు చేశారు. అలాగే, పెరటాసి రద్దీ కారణంగా నేడు ఎస్ఎస్డీ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది.
(The above story first appeared on LatestLY on Oct 02, 2023 09:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

