Pakistan Floods: పాకిస్తాన్‌లో భారీ వరదలు, భయంకరమైన వ్యాధుల కోరల్లో చిక్కుకుపోయిన 80 లక్షల మంది ప్రజలు, మరో వైపు వెంటాడుతున్న ఆహార సంక్షోభం,వేధిస్తున్న నిత్యావసర వస్తువుల కొరత

పాకిస్తాన్‌లోని అనేక జిల్లాలు ఇప్పటికీ వరద నీటితో (Pakistan Floods) నిండి ఉన్నాయి, దీని కారణంగా లక్షలాది మంది ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో ఇంకా 8 మిలియన్ల మంది ప్రజలు వరద నీటిలో (80 lack people suffering from diseases) చిక్కుకున్నారు

Pakistan Floods: పాకిస్తాన్‌లో భారీ వరదలు, భయంకరమైన వ్యాధుల కోరల్లో చిక్కుకుపోయిన 80 లక్షల మంది ప్రజలు, మరో వైపు వెంటాడుతున్న ఆహార సంక్షోభం,వేధిస్తున్న నిత్యావసర వస్తువుల కొరత
akistan flood (photo credit- IANS)

Karachi, Dec 9: పాకిస్తాన్‌లోని అనేక జిల్లాలు ఇప్పటికీ వరద నీటితో (Pakistan Floods) నిండి ఉన్నాయి, దీని కారణంగా లక్షలాది మంది ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో ఇంకా 8 మిలియన్ల మంది ప్రజలు వరద నీటిలో (80 lack people suffering from diseases) చిక్కుకున్నారు. 6 లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయలేదు. స్వచ్ఛమైన తాగునీరు లేకపోవడంతో పిల్లలకు డయేరియా, ఇతర నీటి సంబంధ వ్యాధులు (diseases and food shortage) వచ్చే ప్రమాదం ఉంది. ఇళ్లకు తిరిగి వచ్చే ప్రజలు ఆహారం, నీరు, మందులు వంటి నిత్యావసర వస్తువుల కొరతను కూడా ఎదుర్కొంటున్నారు.

ఐక్యరాజ్యసమితిలోని మానవతావాద సహాయ విభాగం కోఆర్డినేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, సింధ్‌లోని 11 జిల్లాలు, బలూచిస్థాన్‌లోని 2 జిల్లాల్లో వరద నీరు ఇప్పటికీ నిలిచి ఉంది. సింధ్‌లోని దాదు, కంబర్-షహద్‌కోట్, ఖైర్‌పూర్, మిర్‌పుర్‌ఖాస్, జంషెరో, సంఘర్, ఉమర్‌కోట్, బాడిన్, షాహీద్ బెంజిరాబాద్, నౌషెరో ఫిరోజ్, బలూచిస్థాన్‌లోని సోహబత్‌పూర్, జఫ్రాబాద్ జిల్లాల్లో ప్రజలు ఇప్పటికీ వరద నీటితో బాధపడుతున్నారు. దక్షిణ సింధ్‌లోని దాదాపు రెండున్నర లక్షల మంది ప్రజలు స్వదేశానికి తిరిగి రాలేకపోయారు.

వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన పాకిస్తాన్, సుమారు వేయి మందికి పైగా మృతి, 10 బిలియ‌న్ల డాల‌ర్ల న‌ష్టం

WHO ప్రకారం, సెప్టెంబర్ నుండి మలేరియా కేసులు బలూచిస్తాన్‌లో 25 శాతం, ఖైబర్-పఖ్‌టూన్‌లో 58 శాతం మరియు సింధ్‌లో 67 శాతం తగ్గాయి. అయినప్పటికీ ప్రజల ముందు ఆహార సంక్షోభం ఇంకా పొంచి ఉందని తెలిపింది. దాదాపు 11 లక్షల మంది ఇప్పటికీ ఆహార అభద్రతతో పోరాడుతున్నారు. 2023 జనవరి, మార్చి మధ్య అత్యవసర ఆహార సంక్షోభం కనిపిస్తుందని నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

వృత్తిపట్ల ఆ పాక్ జర్నలిస్ట్ నిబద్ధత చూసి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. మీరూ చూడండి..

ఈ ఏడాది భారీ వర్షాలు, కరిగిపోతున్న హిమానీనదాల కారణంగా పాకిస్థాన్‌లో తీవ్ర వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా దాదాపు 3.30 కోట్ల మంది జీవితాలు దెబ్బతిన్నాయి. 1700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రోడ్లు, వంతెనలు మరియు భవనాలు వంటి మౌలిక సదుపాయాలకు విస్తృతమైన నష్టం జరిగింది. వరదల కారణంగా పాకిస్థాన్‌కు 30 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Dec 09, 2022 08:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).