Imran Khan Arrested: పాక్ ప్రధాని ఇంటిపై పెట్రోల్‌ బాంబులు దాడి, ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో రణరంగంగా మారిన దాయాది దేశం, ఎనిమిది మంది మృతి, 290 మందికి గాయాలు

పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని, పీటీఐ (PTI) చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) అరెస్ట్‌తో ఆ దేశం అట్టుడుకుతోంది. అరెస్ట్‌ తర్వాత చెలరేగిన అల్లర్లు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌లోని క్వెట్టా, కరాచీ, పెషావర్, రావల్పిండి, లాహోర్‌ సహా పలు ప్రధాన నగరాల్లో నిరసనకారులు బీభత్సం సృష్టిస్తున్నారు.

Imran Khan Arrested: పాక్ ప్రధాని ఇంటిపై పెట్రోల్‌ బాంబులు దాడి, ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో రణరంగంగా మారిన దాయాది దేశం, ఎనిమిది మంది మృతి, 290 మందికి గాయాలు
Protests in Pakistan. (Photo Credit: ANI)

Islamabad, May 11: పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని, పీటీఐ (PTI) చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) అరెస్ట్‌తో ఆ దేశం అట్టుడుకుతోంది. అరెస్ట్‌ తర్వాత చెలరేగిన అల్లర్లు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌లోని క్వెట్టా, కరాచీ, పెషావర్, రావల్పిండి, లాహోర్‌ సహా పలు ప్రధాన నగరాల్లో నిరసనకారులు బీభత్సం సృష్టిస్తున్నారు.

పాకిస్తాన్ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌ తర్వాత దేశ వ్యాప్తంగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో జరుగుతున్న ఘర్షణల్లో కనీసం ఎనిమిది మంది మరణించగా, 290 మంది వరకు గాయపడ్డారని డాన్‌ గురువారం నివేదించింది. దాదాపు 1,900 మంది నిరసనకారులను అరెస్టు చేయడం, పోలీసు స్టేషన్‌లతో సహా వివిధ ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేయడంతో విభేదాలు పరాకాష్టకు చేరుకున్నాయి.

ఇమ్రాన్ అరెస్టుతో అట్టుడుకుతున్న పాకిస్తాన్, ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని తమ పౌరులను హెచ్చరించిన యూఎస్‌, యూకే, కెనడా

ఇస్లామాబాద్‌లోని అకౌంటబిలిటీ కోర్టు బుధవారం అల్ ఖదీర్ ట్రస్ట్ కేసుకు సంబంధించి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఎనిమిది రోజుల పాటు NAB కస్టడీకి ఇచ్చిన తర్వాత ఇది జరిగింది. అవినీతి సంబంధిత కేసుల్లో పీటీఐ అధినేత, పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కస్టడీ విధించింది ప్రత్యేక న్యాయస్థానం. అయితే దర్యాప్తు సంస్థ ది నేషనల్‌ అకౌంటబిలిటీ(NAB) పదిరోజుల కస్టడీకి కోరగా.. కోర్టు మాత్రం ఎనిమిది రోజులకు మాత్రమే అనుమతించింది.

కేంద్ర సెక్రటరీ జనరల్ అసద్ ఉమర్‌ను అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల తర్వాత పీటీఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫవాద్ చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, ఇస్లామాబాద్‌లలో, క్షీణిస్తున్న పరిస్థితిని నియంత్రించే ప్రయత్నంలో పరిపాలన సైన్యాన్ని పంపింది. ప్రదర్శనకారులు కార్ప్స్ కమాండర్ లాహోర్ ఇంటిలోకి చొరబడి రావల్పిండిలోని GHQ వద్ద ఒక గేటును కూల్చివేసిన ఒక రోజు తర్వాత, మోహరింపు జరిగింది.

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై అమెరికా కీలక వ్యాఖ్యలు, ఏ రాజకీయ పార్టీ పక్షాన గానీ, వ్యక్తల పక్షాన గానీ నిలబడమని స్పష్టం

ఈరోజు తెల్లవారుజామున, పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) వైస్ ఛైర్మన్ మఖ్దూమ్ షా మెహమూద్ ఖురేషీని ఇస్లామాబాద్ పోలీసులు అరెస్టు చేసి అజ్ఞాత ప్రాంతానికి తరలించారు. "తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ వైస్ ఛైర్మన్ మఖ్దూమ్ షా మెహమూద్ ఖురేషీని ఇస్లామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు మరియు తెలియని ప్రదేశానికి బదిలీ చేసారు" అని పార్టీ గురువారం ట్వీట్ చేసింది.

పాకిస్తాన్‌కు చెందిన ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం, బుధవారం మధ్యాహ్నం పోలీసులు విఫలయత్నం చేసిన తరువాత ఇస్లామాబాద్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ హౌస్ నుండి PTI నాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం, PTI ఛైర్మన్ ఖాన్‌ను అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసి, పోలీస్ లైన్స్ హెడ్‌క్వార్టర్స్‌లోని అకౌంటబిలిటీ కోర్టు ముందు హాజరుపరిచారు. అకౌంటబిలిటీ బ్యూరో పోలీస్ లైన్స్‌లో మాజీ ప్రీమియర్‌ను విచారిస్తుంది.పంజాబ్ మరియు ఖైబర్ పఖ్తున్ఖ్వాలో అల్లర్లు, దహనాల కేసుల్లో ఖురేషీని పోలీసులు అదుపులోకి కోరుతున్నారు. అతని అరెస్టుకు ముందు, ఖురేషీ PTI కార్యకర్తలకు దేశంలో నిజమైన స్వాతంత్ర్యం కోసం తమ పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

రాత్రికి రాత్రే తనకు నరకం చూపించారంటూ ఆరోపణలకు దిగారు ఇమ్రాన్‌ ఖాన్‌. కనీసం వాష్‌రూం కూడా వినియోగించుకోనివ్వకుండా తనను టార్చర్‌ చేశారంటూ కోర్టులో బోరుమన్నాడు ఇమ్రాన్‌ ఖాన్‌. అంతేకాదు.. నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించడానికి తనకు ఇంజెక్షన్ ఇచ్చారని ఆరోపించారాయన.మే 17వ తేదీన ఈ కేసులో తదుపరి వాదనలు విననుంది కోర్టు.

మరోవైపు పీటీఐ కార్యకర్తలు పాక్‌ను అగ్గిగుండంగా మార్చేశారు. ఒకవైపు ఇస్లామాబాద్‌లో గుమిగూడాలని పిలుపు ఇస్తూనే.. మరోవైపు ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. దీంతో పీటీఐ ముఖ్యనేతలను సైతం అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.

ఇదిలా ఉంటే సుమారు 500 మందికిపైగా పీటీఐ మద్దతుదారులు లాహోర్‌లోని (Lahore) పాక్‌ ప్రధాని షేబాజ్ షరీఫ్ ( PM Shehbaz Sharif) ఇంటిని చుట్టుముట్టారు. ప్రధాని భవనంలోకి పెట్రోల్‌ బాంబులు (petrol bombs ) విసిరి నిరసన చేపట్టారు. అనంతరం అక్కడ పార్క్‌ చేసిన వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో ప్రధాని నివాసం వద్ద గార్డులు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసు బలగాలు అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకారులు పరారైనట్లు అధికారులు వెల్లడించారు.

ప్రధాని నివాసానికి చేరుకోవడానికి ముందు ఆందోళనకారులు మోడల్‌ టౌన్‌లోని అధికార పీఎంఎల్-ఎన్ సెక్రటేరియట్‌పైనా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడున్న బారికేడ్లకు నిప్పు పెట్టినట్లు చెప్పారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లో రెండు రోజుల్లోనే మొత్తంగా 14 ప్రభుత్వ భవనాలు, 21 పోలీసు వాహనాలకు నిప్పు పెట్టినట్టు తెలిపారు.

(The above story first appeared on LatestLY on May 11, 2023 12:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).