Pakistan Gun Attack: ప్యాసింజ‌ర్ వాహ‌నాల‌పై కాల్పులు 50 మంది మృతి, పాకిస్థాన్ లో ఉగ్ర‌వాదుల దుశ్చ‌ర్య‌

పాకిస్థాన్ లోని వాయువ్య జిల్లా కుర్రాంలో (Kurram) ప్యాసింజర్ వాహనాలపై సాయుధ దుండగులు గురువారం జరిపిన కాల్పుల్లో (Gunmen Open Fire On Passenger Vehicles) 50 మంది మరణించారు. వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. మరో 29 మందికి గాయాలయ్యాయి.

Pakistan Gun Attack: ప్యాసింజ‌ర్ వాహ‌నాల‌పై కాల్పులు 50 మంది మృతి, పాకిస్థాన్ లో ఉగ్ర‌వాదుల దుశ్చ‌ర్య‌
Representational image (Photo credits: ANI)

Islamabad, NOV 21: పాకిస్థాన్ లోని వాయువ్య జిల్లా కుర్రాంలో (Kurram) ప్యాసింజర్ వాహనాలపై సాయుధ దుండగులు గురువారం జరిపిన కాల్పుల్లో (Gunmen Open Fire On Passenger Vehicles) 50 మంది మరణించారు. వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. మరో 29 మందికి గాయాలయ్యాయి. పెషావర్, పరాచినార్ మధ్య వెళుతున్న రెండు కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకుని సాయుధులు కాల్పులు జరిపారని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ నదీం అసియం చౌదరి ఆరోపించారు. ఈ ఘటన అతిపెద్ద విషాదం అని పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. పోలీసుల ఎస్కార్ట్ తో వస్తున్న రెండు వేర్వేరు కాన్వాయ్ లపై దుండగులు కాల్పులు జరిపారని సీనియర్ అధికారి జావెద్ ఉల్లా మెహ్సూద్ తెలిపారు.

Bomb Cyclone Live Tracker Map on Windy: బాంబ్ సైక్లోన్ లైవ్ ట్రాకర్ ఇదిగో, ముంచుకొస్తున్న తీవ్ర తుఫానుతో అమెరికా విలవిల, భయం గుప్పిట్లో పలు రాష్ట్రాలు 

సుమారు 10 మంది సాయుధ దుండగులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారన్నారు. పెషావర్ నుంచి పరాచినార్ మధ్య వెళుతున్న కాన్వాయ్ లో తన బంధువులు ఉన్నారని స్థానిక నివాసి జియారాత్ హుస్సేన్ తెలిపాడు. ఈ ఘటనను పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఖండించారు. పౌరులపై హింసను అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. షియా, సున్నీ ముస్లింల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న భూ వివాదం వల్లే ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడికి పాల్పడిన వారిని పోలీసులు, దర్యాప్తు అధికారులు గుర్తించలేదు. ఏ సంస్థ కూడా తమదే బాధ్యత అని ప్రకటించుకోలేదు.

(The above story first appeared on LatestLY on Nov 21, 2024 10:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).