![](https://test1.latestly.com/uploads/images/2025/02/1-799675339-1-.jpg?width=380&height=214)
Newyork, Feb 14: అమెరికా పర్యటనలో (US Tour) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం అమెరికా చేరుకున్న ప్రధాని.. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. వాణిజ్యం, సుంకాలు, ఇమిగ్రేషన్, ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు తదితర కీలక అంశాలపై ఇరు దేశాధినేతలు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. మోదీ వెంట భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. కీలక భేటీ అనంతరం ఇరువురు దేశాధినేతలు మీడియాతో మాట్లాడుతూ ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు.
అమెరికా టూ ఇండియా.. కొనసాగుతున్న భారతీయుల బహిష్కరణ.. మరో రెండు విమానాల్లో తరలింపునకు సిద్ధం!
మోదీ-ట్రంప్ ఆత్మీయ ఆలింగనం
మిమ్మల్ని చాలా మిస్ అయ్యానంటూ మోదీతో తెలిపిన డొనాల్డ్ ట్రంప్ pic.twitter.com/Y2X47KP3M3
— BIG TV Breaking News (@bigtvtelugu) February 14, 2025
భారత్ విధిస్తున్న టారిఫ్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనం
అధిక టారిఫ్లు వ్యాపార, వాణిజ్యానికి అడ్డంకిగా మారాయన్న ట్రంప్
ఈ క్రమంలో ఇండియాలో వస్తువులు అమ్మడం కష్టతరం అవుతోందని వెల్లడి
ప్రపంచంలో ఎక్కువ టారిఫ్లు విధించే దేశం భారత్ అని వ్యాఖ్యానించిన ట్రంప్
ఇండియా ఎంత… pic.twitter.com/hmKObrvQ7t
— BIG TV Breaking News (@bigtvtelugu) February 14, 2025
ప్రధాని మోదీతో భేటీ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు
భారత్కు నరేంద్ర మోదీ లాంటి నేత ఉండటం గర్వకారణమన్న ట్రంప్
మోదీ, భారత్తో మంచి సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసిన ట్రంప్
ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మాకు ఆయిల్, గ్యాస్ లాంటి చమురు వనరులు అందుబాటులో ఉన్నాయి… https://t.co/TJOO8rczWi pic.twitter.com/3P8IQB6IcA
— BIG TV Breaking News (@bigtvtelugu) February 14, 2025
డొనాల్డ్ ట్రంప్ నాకు మంచి మిత్రుడు: మోదీ
శ్వేతసౌధంలో మళ్లీ ట్రంప్ని అధ్యక్షుడిగా చూడడం ఆనందంగా ఉంది
140 కోట్ల మంది భారతీయుల తరఫున ఆయనకు శుభాకాంక్షలు
మరో నాలుగేళ్లు ట్రంప్తో కలిసి పని చేయబోతుండడం సంతోషంగా ఉంది
నాలాగే ట్రంప్కి దేశమే ఫస్ట్ ప్రియారిటీ
భారత్… https://t.co/TJOO8rczWi pic.twitter.com/10mzTqWw8B
— BIG TV Breaking News (@bigtvtelugu) February 14, 2025
ఒకరిపై మరొకరు ప్రశంసలు
మీడియా వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... "శ్వేతసౌధంలో మళ్లీ ట్రంప్ ను చూడటం ఆనందంగా ఉంది. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఆయనకు శుభాకాంక్షలు. మరో నాలుగేళ్లు ట్రంప్ తో కలిసి పని చేయనుండటం సంతోషంగా ఉంది. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం" అని అన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ... "భారత్ కు నరేంద్ర మోదీ లాంటి నేత ఉండటం గర్వకారణం. మోదీ నాకు చాలా ఏళ్లుగా మిత్రుడు. మా స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తాం. దేశాలుగా భారత్, యూఎస్ కలిసి ఉండటం చాలా ముఖ్యం” అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి.