I am Hazarath, Telugu Lead on LatestLY Telugu. I have been part of the journalism and digital industry for 10 years, with previous work experience for One India and 99tv and Surya and ATV. Writing my Hobby and Reporting my passion.
ఏపీలోని మచిలీపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. పోలీసుల మంటూ ఓ యువతిని బలంవంతగా ఎత్తుకెళ్లిన దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.పోలీసులమంటూ తనను ఎత్తుకెళ్లిన ఇద్దరు తనపై లైంగికదాడి (raping woman in Andhra Pradesh) చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు, కంపోజర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు (FIR Against Rahul Jain) నమోదు అయింది. ముంబైలో ఉన్న 30 ఏళ్ల కాస్ట్యూమ్ స్టయిలిస్ట్ పై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై అత్యాచారం (Raping Costume Stylist in His Mumbai Flat)చేశాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదయింది.
అచ్యుతాపురంలో ఏటీజీ టైర్స్ కంపెనీని సీఎం జగన్ ( CM Jagan Mohan Reddy) ప్రారంభించారు. జపాన్కు చెందిన యోకహామా గ్రూప్కు చెందిన ATG టైర్ల పరిశ్రమ సుమారు 100 ఎకరాల్లో 1,500 కోట్ల (Rs 1500-crore ATG tyre unit ) అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తోంది.
ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (Airtel New Prepaid Plans) ఆవిష్కరించింది. కాగా భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో పలు ప్లాన్లను ఎప్పుడో విడుదల చేసింది. ఎయిర్ టెల్ కాస్త ఆలస్యంగా ఇదే బాటలో నడిచింది.
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ( YS Jagan Government) క్షమాభిక్ష ప్రసాదించడంతో రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి పలువురు ఖైదీలు సోమవారం విడుదలయ్యారు.
అనసూయ మాట్లాడుతుండగా సుడిగాలి సుధీర్ స్టేజ్పైకి వచ్చాడు. అతన్ని చూడగానే ఫ్యాన్స్ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. స్వయంగా రాఘువేంద్ర రావు మైక్ తీసుకొని సైలెంట్గా ఉండాలని కోరినా సుధీర్ ఫ్యాన్స్ వినిపించుకోలేదు. దీంతో ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. సుధీర్ సహా అందరూ మాట్లాడుతారని, కాస్త ఓపిగ్గా ఉండాలని కోరారు.
జనగామ జిల్లాలోని దేవరుప్పుల ఘటనతో పోలీస్ సెక్యూరిటీని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరాకరించారు.భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని నా భద్రతను తన కార్యకర్తలే చూసుకుంటారని తేల్చి చెప్పారు. బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఓ దారుణ హత్య కలకలం రేపుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు.దుండగులు కత్తులతో కొడవళ్లతో దారుణంగా (TRS leader Krishnaiah murdered brutally )హతమార్చారు.
ఛత్తీస్గఢ్లోని బస్తర్ కంకెర్ జిల్లాలో భారీ వర్షాలకు ఇంటి గోడ కూలిపోయి ముగ్గురు పిల్లలు సహా భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. పఖంజోర్ ప్రాంతం, ఇర్పానార్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ శలభ్ సిన్హా తెలిపారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. అనంతరం ఉత్తర ఒడిశాకు ఆనుకుని పశ్చిమ, వాయవ్య దిశగా పశ్చిమ బెంగాల్ తీరం వైపు పయనించింది.
పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సహా ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ (Mukesh Ambani Get Threat Calls) వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన హరికిషన్దాస్ ఆస్పత్రి నెంబర్కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి.
స్వాతంత్ర్య వజ్రోత్సవాన యావత్ భారతం మువ్వన్నెల రంగులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ప్రతి ఇంటా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకాలు ( Indian flags) దేశానికి కొత్త అందాలు తీసుకొచ్చాయి.ఇక గగన వీధిలో సైతం దేశ పతకాం రెపరెపలాడింది.
ఇద్దరు స్నేహితుల మధ్య ఛాటింగ్ వల్ల విమానం ఆరుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. మంగళూరు నుంచి ముంబైకి వెళ్లాల్సిన విమానంలో (Mangaluru-Mumbai IndiGo Flight) ఓ వ్యక్తి మొబైల్కి సందేశం రావడంతో ఆ విమానం ఆగిపోయింది
కర్ణాటకలో దారుణ ఘటన (Karnataka shocker) చోటు చేసుకుంది. ఉన్మాదిలా మారిన ఓ భర్త కోర్టు ఆవరణలోనే తన భార్య గొంతును కత్తితో (Husband slits wife's throat ) కోశాడు. అంతకు పది నిమిషాల ముందే కోర్టులో నిర్వహించిన కౌన్సెలింగ్లో ఇద్దరమూ కలిసి బతుకుతామని నిర్ణయానికి కూడా వచ్చారు.
స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకున్న సంగతి విదితమే. తొమ్మిందేండ్ల ఓ దళిత విద్యార్థి.. టీచర్ కోసం ఉంచిన కుండలోని నీళ్లను తాగాడని ఆ బాలుడిని టీచర్ చితకబాదాడు. ఆ బాలుడు చికిత్స పొందుతూ (Death of Dalit Boy) మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్లోని జలోర్ జిల్లాలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకుంది.
స్వాతంత్ర దినోత్సవ సంబరాలు దేశం వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ ఘనంగా జరుగుతున్నాయి. వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. గోల్కోండ కోటలో (Golconda Fort) జాతీయ జెండాను ఎగురవేశారు.
స్వాతంత్ర దినోత్సవ సంబరాలు దేశం వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ( AP Chief Minister YS Jagan) విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడుకలు (15th of August 75th Independence Day) ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ఎర్రకోట (Red Fort)పై జాతీయ జెండా (National flag)ను ఆవిష్కరించారు.
బ్రిటిష్ వారి రాక్షస పాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.
బ్రిటిష్ వారి రాక్షస పాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు.