Rajendra Prasad: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో నటుడి కుమార్తె మృతి
విలక్షణమైన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందారు.
Hyderabad, Oct 5: విలక్షణమైన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె (Daughter) గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందారు. గాయత్రి నిన్న కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ, ఆమె కన్నుమూశారు.
చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్, భద్రతా బలగాల స్పెషల్ ఆపరేషన్, 30 మంది నక్సల్స్ మృతి
రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి అకస్మాత్తుగా మృతి చెందారు. 38 ఏళ్ల కుమార్తె ఇలా సడెన్గా చనిపోవడంతో రాజేంద్రప్రసాద్ కుటుంబం షాక్కు గురైంది. ఛాతీలో నొప్పి ఉందని నిన్న ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స… pic.twitter.com/1desjsT7wu
— BIG TV Breaking News (@bigtvtelugu) October 5, 2024
కుమార్తె వీడటంతో..
రాజేంద్రప్రసాద్ కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురిపై రాజేంద్రప్రసాద్ కు అమితమైన ప్రేమ. అలా ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గాయత్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Oct 05, 2024 08:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

