CPI Narayana Fires On Nagarjuna: నాగార్జున పరువు బిగ్ బాస్ షోతో ఎప్పుడో పోయింది.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం ఓ జోక్ లా ఉంది.. సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యంగ్యంగా స్పందించారు.

CPI Narayana Fires On Nagarjuna: నాగార్జున పరువు బిగ్ బాస్ షోతో ఎప్పుడో పోయింది.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం ఓ జోక్ లా ఉంది.. సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు
CPI National Secretary Narayana

Hyderabad, Oct 13: తెలంగాణ (Telangana) మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యంగ్యంగా స్పందించారు. ఎవరైనా పరువు కలిగినోళ్లు పరువునష్టం దావా వేస్తారు కానీ... పరువులేని నాగార్జున పరువునష్టం దావా వేయడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ షోతో నాగార్జున ఎప్పుడో పరువు పోగొట్టుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నారాయణ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు...కొడుకు జైలుకు వెళ్లడంతో బెంగతో ఉన్న తల్లి బీబీ ఖాన్ కు తీవ్ర అస్వస్థత..

నారాయణ ఏమన్నారంటే?

‘పరువు లేనోడు పరువునష్టం దావా వేస్తాడా? బిగ్ బాస్ షోతో పరువు పోగొట్టుకున్న నాగార్జున ఇప్పుడు కొండా సురేఖపై పరువునష్టం దావా వేశాడు. సమంత లాంటి వాళ్లు పరువునష్టం దావా వేస్తే అర్థం ఉంది కానీ... బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా అన్ పాప్యులర్ అయిన నాగార్జున పరువునష్టం దావా వేయడం అంటే అంతకంటే అవమానకరమైన విషయం మరొకటి ఉండదు. కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పిన తర్వాత ఇక దానిపై ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. నాగార్జున వంటి వ్యక్తి పరువునష్టం దావా వేయడం ఓ జోక్ లా అనిపిస్తోంది’ అని నారాయణ ఎద్దేవా చేశారు.

మెగాస్టార్ దసరా ట్రీట్.. చిరంజీవి విశ్వంభర టీజర్ రిలీజ్...విజువల్ వండర్‌గా టీజర్

(The above story first appeared on LatestLY on Oct 13, 2024 08:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).