
Newdelhi, Feb 17: సోమవారం తెల్లవారుజామున ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో భూమి కంపించింది (Earthquake In Delhi). రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీలోనే (Delhi) భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 5 కిలోమీటర్ల లోతున భూంకంపం సంభవించినట్టు జాతీయ భూంకంప కేంద్రం తెలిపింది. భూకంపంతో హస్తినవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలేం జరుగుతుందో అర్థంకాకుండా ఇండ్లనుంచి బయటకు వచ్చి వీధుల్లో గుమిగూడారు. భూంకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. భూ ప్రకంపనల కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో అన్నీ ఊగిపోయాయని, ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారని రైల్వే స్టేషన్ లో ఓ వ్యాపారి తెలిపారు. ఇక, ఘజియాబాద్ లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భవనం మొత్తం ఊగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని ఆయన పేర్కొన్నారు.
BREAKING
ఢిల్లీలో భూకంపం
సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్సీఆర్లో భూకంపం
ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ సహా వివిధ ప్రాంతాల్లో భూప్రకంపనలు
రిక్టర్స్కేల్పై తీవ్రత 4.3గా నమోదు pic.twitter.com/mlYaoYhEoH
— BIG TV Breaking News (@bigtvtelugu) February 17, 2025
ఢిల్లీ భూకంపంపై ప్రధాని మోదీ స్పందన
ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరిన మోదీ
పరిస్థితిపై సంబంధింత అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసిన మోదీ https://t.co/xg9cgzP7Zj pic.twitter.com/wjwZZMGW8M
— BIG TV Breaking News (@bigtvtelugu) February 17, 2025
అప్రమత్తత అవసరం
ఢిల్లీ భూకంపం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అందరూ ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. మరోవైపు, ఢిల్లీలో ఇప్పుడే భూకంపం సంభవించిందని తాత్కాలిక ముఖ్యమంత్రి అతిశీ తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.