Telangana Rains: రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అవర్తనం.. దాని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

తెలంగాణలో వచ్చే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

Telangana Rains: రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అవర్తనం.. దాని ప్రభావంతో  తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
Rains

Hyderabad, Aug 13: తెలంగాణలో (Telangana) వచ్చే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ఆవర్తనం కారణంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఈ ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది.

BJP Leader Indrani Tahbildar Suicide: పార్టీ సీనియర్ నేతతో శారీరక సంబంధం, ఇరువురు సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్, అవమానం భరించలేక గొంతుకోసుకొని ఆత్మహత్య

New Bill on IPC: కామాంధులు రేప్ చేయాలంటే భయపడేలా కొత్త చట్టాలు, మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్ష, గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డితే 20 ఏళ్లు జైలు, లోక్ సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన అమిత్ షా 

శనివారం దంచికొట్టిన వానలు

శనివారం తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. నల్గొండ జిల్లా ఘన్‌పూర్‌లో 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా నందనంలో 53 మిల్లీమీటర్లు, ఖమ్మం జిల్లా లింగాలలో 43, రావినూతల, తిమ్మారావుపేటలలో 42, రంగారెడ్డి జిల్లా బోడకొండలో 39 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

(The above story first appeared on LatestLY on Aug 13, 2023 08:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).