Boy Alone Flight Journey: తల్లిని చూడాలనే ఆరాటం, విమానంలో 5 ఏళ్ల బాలుడి ఒంటరి ప్రయాణం, మూడు నెలల తర్వాత తల్లి చెంతకు చేరిన విహాన్ శర్మ

మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారతదేశంలో దేశీయ విమానాలు తిరిగి సేవలను ప్రారంభించిన మొదటిరోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 5 ఏళ్ల పిల్లవాడు ఢిల్లీ నుండి బెంగళూరుకు ఒంటరిగా (5-Year-Old Boy Travels Alone on Flight) ప్రయాణించాడు. ANI చేసిన ట్వీట్ ప్రకారం, విహాన్ శర్మ అనే చిన్న పిల్లవాడు (5 Year Old Boy Flight Journey) మూడు నెలల వ్యవధి తరువాత తన తల్లి చెంతకు చేరాడు.

Boy Alone Flight Journey: తల్లిని చూడాలనే ఆరాటం, విమానంలో 5 ఏళ్ల బాలుడి ఒంటరి ప్రయాణం, మూడు నెలల తర్వాత తల్లి చెంతకు చేరిన విహాన్ శర్మ
5-yr-old Travels Alone in Flight From Delhi to Bengaluru (Photo Credits: ANI)

Bengaluru, May 25: మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారతదేశంలో దేశీయ విమానాలు తిరిగి సేవలను ప్రారంభించిన మొదటిరోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 5 ఏళ్ల పిల్లవాడు ఢిల్లీ నుండి బెంగళూరుకు ఒంటరిగా (5-Year-Old Boy Travels Alone on Flight) ప్రయాణించాడు. ANI చేసిన ట్వీట్ ప్రకారం, విహాన్ శర్మ అనే చిన్న పిల్లవాడు (5 Year Old Boy Flight Journey) మూడు నెలల వ్యవధి తరువాత తన తల్లి చెంతకు చేరాడు.

బెంగళూరు చేరుకున్న తరువాత, విహాన్‌ను అతని తల్లి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kempegowda International Airport) రిసీవ్ చేసుకుంది. "నా 5 సంవత్సరాల కుమారుడు విహాన్ శర్మ ఢిల్లీ నుండి ఒంటరిగా విమానంలో ప్రయాణించాడు, అతను 3 నెలల తరువాత తిరిగి బెంగళూరులో నా చెంతకు చేరాడు" అని అతని తల్లి తెలిపింది. అయితే ఆ పిల్లవాడు అక్కడ ఎందుకు ఉండిపోయాడనే వివరాలు ఇంకా తెలియలేదు.  చివరి నిమిషంలో విమానాలు రద్దు, అయోమయంలో ప్రయాణికులు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా రద్దు చేయడంపై ఆగ్రహం

దేశీయ విమాన కార్యకలాపాలు సోమవారం తిరిగి ప్రారంభమైనందున బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనేక మంది ప్రయాణికులు కనిపించారు. ఉదయం 9 గంటల వరకు విమానాశ్రయంలో 5 రావాల్సినవి మరియు 17 బయలుదేరేవి మరియు ఇతర 9 విమానాలు రద్దు చేయబడ్డాయి.

Here's the tweet:

విమాన సేవలు తిరిగి ప్రారంభమైనందున, భారతదేశంలోని అనేక మార్గాల్లోని ప్రయాణీకులు విమానయాన సంస్థల నుండి ముందస్తు సమాచారం లేకుండా చివరి నిమిషంలో తమ టిక్కెట్లను రద్దు చేసినట్లు  ఫిర్యాదు చేశారు. ఢిల్లీ యొక్క ఐజిఐ విమానాశ్రయం నుండి సుమారు 80 రావాల్సిన/ బయలుదేరే విమానాలు రద్దు చేయబడినట్లు ANI యొక్క తాజా నవీకరణ పేర్కొంది. పది రాష్ట్రాలే కొంప ముంచాయి, 90 శాతం కేసులు ఆ రాష్ట్రాల్లోనే, దేశంలో లక్షా 38 వేలు దాటిన కోవిడ్ 19 కేసులు, 4,021 మంది మృతి

భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ మినహా అన్నీ రాష్ట్రాలు సోమవారం దేశీయ విమాన సేవలను తిరిగి ప్రారంభించాయి. మే 26, మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాలు తిరిగి ప్రారంభమవుతాయని, పశ్చిమ బెంగాల్ మే 28 గురువారం తిరిగి ప్రారంభమవుతుందని సివిల్ ఏవియేషన్ హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. విమానయాన అధికారుల ప్రకారం, రెండు నెలల విరామం తర్వాత భారతదేశంలో దేశీయ ప్రయాణీకుల విమానాలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. దేశంలో సోమవారం 600 విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు.

(The above story first appeared on LatestLY on May 25, 2020 11:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).