
Patna, Jan 24: బిహార్లోని లఖిసరాయ్ జిల్లాలో తమకు సిగరెట్ ఇవ్వలేదని నలుగురు వ్యక్తులు 65 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శుక్రవారం తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని, మిగతా వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. “ఈ సంఘటన బుధవారం రాత్రి నవాబ్గంజ్ ప్రాంతంలోని మహిళ ఇంటికి వెళ్లి సిగరెట్లు అడుగుతున్నప్పుడు జరిగింది. ఆమె నిరాకరించడంతో, వారు ఆమెను సమీపంలోని పొలానికి ఈడ్చుకెళ్లారు. అనంతరం నేరానికి పాల్పడ్డారని ఎస్పీ అజయ్ కుమార్ పిటిఐకి తెలిపారు.
ఆమె కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా, వెంటనే కేసు నమోదు చేయబడింది. ఇద్దరు నిందితులను గురువారం అరెస్టు చేశారు. మిగతా ఇద్దరి జాడ కోసం వెతుకులాట కొనసాగుతోందని తెలిపారు. వృద్ధురాలిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు కుమార్ తెలిపారు.