Coronavirus Outbreak in India: కనికా కపూర్కు కరోనా, కరోనా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్న ఎంపీలు, అన్ని పర్యటనలను రద్దు చేసుకున్న రాష్ట్రపతి, ఇండియాలో 236 మార్క్ని దాటిన కరోనా కేసులు
కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య భారతదేశంలో (India) రోజు రోజుకు పెరుగుదలను నమోదు చేసుకుంటూ వెళుతోంది. ఇప్పటివరకు అత్యధిక సింగిల్-డే రికార్డు నమోదైంది. వైరస్ సోకిన రోగుల సంఖ్య శుక్రవారం 200 మార్కును దాటింది, ఈ నివేదిక ప్రచురించే సమయానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) 236 గా నిర్ధారించబడింది.
New Delhi, March 21: కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య భారతదేశంలో (India) రోజు రోజుకు పెరుగుదలను నమోదు చేసుకుంటూ వెళుతోంది. ఇప్పటివరకు అత్యధిక సింగిల్-డే రికార్డు నమోదైంది. వైరస్ సోకిన రోగుల సంఖ్య శుక్రవారం 200 మార్కును దాటింది, ఈ నివేదిక ప్రచురించే సమయానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) 236 గా నిర్ధారించబడింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్డేట్ చేసిన నంబర్లను జారీ చేసేటప్పుడు ఉదయం నాటికి ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో 18, ఆంధ్రప్రదేశ్లో 3
ఈ రోజు మరణాలు ఏవీ నివేదించకపోవడంతో, మరణాల (Corona Deaths) సంఖ్య నాలుగు వద్ద ఉంది. అయితే, పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 50 పెరిగింది. ప్రస్తుతానికి, ఐసిఎంఆర్ ఈ వైరస్ వ్యాప్తిలో భారతదేశం స్టేజ్ 2 కేటగిరీలో ఉందని నొక్కి చెప్పింది - ఎందుకంటే కొత్త కేసులన్నీ ట్రావెల్ హిస్టరీ ఉన్నవారిలో లేదా వారితో పరిచయం ఉన్నవారిలో ఉన్నాయి.
మార్చి 22 నుండి ప్రతి ఆదివారం దేశం "జనతా కర్ఫ్యూ" (Janata Curfew ) కు కట్టుబడి ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. ఇది జనం కోసం జనం ద్వారా జనమే విధించుకున్న కర్ఫ్యూ అని ప్రధాని పేర్కొన్నారు. "సామాజిక దూరం" (Social Distance) యొక్క ప్రాముఖ్యతను పిఎం మోదీ నొక్కి చెప్పారు. వైరస్ వ్యాప్తిని నివారించడానికి సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితమవ్వాలని, వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులు "వర్క్ ఫ్రమ్ హోమ్" ద్వారానే విధులు నిర్వహించాలని పీఎం సూచించారు.
ప్రైవేట్ రంగాల యాజమాన్యాలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా ప్రోత్సహించాలి. ఇందుకోసం ఎవరి వేతనాల్లో కోతపెట్టొద్దు, అలాగే ఈ కరోనాకాలంలో ఎవరైనా ఉద్యోగి పనిచేయలేని పక్షంలో కూడా సాలరీస్ తగ్గించొద్దు, నేను యాజమాన్యాలను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అని మోదీ అన్నారు. కాగా మార్చి 21 అర్ధరాత్రి నుండి మార్చి 22 మధ్య రాత్రి 10 గంటల మధ్య అన్ని ప్యాసింజర్ రైలు సర్వీసులను నిలిపివేస్తామని తెలిపింది.
కాగా బాలీవుడ్ ప్రముఖ గాయని కనికా కపూర్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఏకంగా ఎంపీలు సెల్ఫ్ క్వారంటైన్ విధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే గాయని కనికా కపూర్ ఇటీవల లక్నోలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్లు పాల్గొన్నారు. ఇప్పుడు కనికా కపూర్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వసుంధర రాజే, దుష్యంత్ సింగ్లు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు.
రాజస్తాన్ నుంచి ఎంపీగా ఉన్న దుష్యంత్ పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్, ఎంపీ అనుప్రియా పటేల్లతో సన్నిహితంగా మెలిగారు. దీంతో వారివురు కూడా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేగాక మార్చి 18న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన ఉపాహార విందుకు పలువురు ఎంపీలతోపాటు దుష్యంత్ కూడా హాజరయ్యారని, బుధవారం రవాణా, సాంస్కృతిక శాఖలు నిర్వహించిన సమావేశంలోనూ దుష్యంత్ 20 మంది ఎంపీలతో కలిసి ఉన్నారని డెరెక్ వివరించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని ఆయన కోరారు.
ఎంపీ దుష్యంత్ రాష్ట్రపతిని కలవడంతో టెన్సన్ మొదలైంది.ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు. ప్రస్తుతానికి ఆయన తన పర్యటలు అన్నీ వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది.
(The above story first appeared on LatestLY on Mar 21, 2020 08:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

