Google Safety Engineering Centre: తెలంగాణలో గూగుల్ భారీ పెట్టుబడులు, హైదరాబాద్లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు..సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ కంపెనీ ప్రతినిధుల చర్చలు సఫలం
తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది గూగుల్ కంపెనీ. హైదరాబాద్లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డిని కలిసి చర్చలు జరిపారు గూగుల్ ప్రతినిధులు. ఆగస్టు 2024లో గూగుల్ హెడ్ క్వార్టర్స్కు వెళ్లిన సమయంలో చర్చలు జరిపారు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు. గూగుల్ మేనేజ్మెంట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేలా ఒప్పించారు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది గూగుల్ కంపెనీ. హైదరాబాద్లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డిని కలిసి చర్చలు జరిపారు గూగుల్ ప్రతినిధులు.
ఆగస్టు 2024లో గూగుల్ హెడ్ క్వార్టర్స్కు వెళ్లిన సమయంలో చర్చలు జరిపారు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు. గూగుల్ మేనేజ్మెంట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేలా ఒప్పించారు రేవంత్ రెడ్డి.
Here's Tweet:
Delighted to share that today morning, along with my ministerial colleague
shri @OffDSB garu…we closed major cutting-edge technology investment partnership with #Google for #Hyderabad.
Google has chosen Hyderabad to establish its Safety Engineering Centre (GSEC), which will be… pic.twitter.com/8AYyIVmVRE
— Revanth Reddy (@revanth_anumula) December 4, 2024
ఆసియా పసిఫిక్ రీజియన్లో టోక్యో తర్వాత హైదరాబాద్లోనే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుకానుంది. ఈ సెంటర్ ఏర్పాటుతో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
(The above story first appeared on LatestLY on Dec 04, 2024 03:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

