India-US Deal: సరిహద్దులో ముప్పు పొంచి ఉన్న వేళ అమెరికాతో భారత్ కీలక ఒప్పందం, 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు భారత్ సంతకాలు, విలువ రూ. 32 వేల కోట్లు పైగానే..
సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ల నుంచి నిరంతరం ముప్పు పొంచివున్న వేళ.. సైన్యాన్ని మరింత పటిష్టపరిచేలా భారత్.. అమెరికాతో కీలక ఒప్పందం చేసుకుంది.అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ (Predator) డ్రోన్ల కొనుగోలు డీల్పై మంగళవారం భారత్ సంతకం చేసింది
New Delhi, Oct 15: సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ల నుంచి నిరంతరం ముప్పు పొంచివున్న వేళ.. సైన్యాన్ని మరింత పటిష్టపరిచేలా భారత్.. అమెరికాతో కీలక ఒప్పందం చేసుకుంది.అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ (Predator) డ్రోన్ల కొనుగోలు డీల్పై మంగళవారం భారత్ సంతకం చేసింది. ఈ డీల్ కింద మన ప్రభుత్వం మొత్తం 31 ఎంక్యూ9బీ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది. వీటికి ప్రత్యేక క్షిపణులు, లేజర్ గైడెడ్ బాంబులను కూడా ఈ జనరల్ అటామిక్స్ సంస్థ సమకూర్చనుంది. ఈ మొత్తం 31 డ్రోన్లలో 15 నౌకాదళానికి, 8 సైన్యానికి, మిగిలినవి వాయుసేనకు కేటాయించనున్నారు. ఈ ఒప్పందం మొత్తం విలువ 3.5 బిలియన్ డాలర్లని తెలుస్తోంది.
అమెరికా ఉత్పత్తిదారుడు జనరల్ ఆటోమిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్, విదేశీ మిలిటరీ సేల్స్ శాఖ మధ్య కాంట్రాక్టు కుదిరింది. ఈ ఖరీదుకు గత నెలలోనే క్యాబినెట్ కమిటీ నుంచి క్లియరెన్స్ దక్కింది.ఆగస్టులో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఆయన బృందానికి డ్రోన్ సామర్థ్యాలను ప్రదర్శించి చూపించారు. ఇప్పటికే పశ్చిమాసియా, అఫ్గాన్ సంక్షోభాల్లో ఈ డ్రోన్లను విరివిగా వాడారు.
మాజీ మంత్రిపై దుండగుల కాల్పులు, ఆస్పత్రికి తరలించేలోపే మృతి, మహారాష్ట్ర ఎన్నికల ముందు కలకలం
చాలా ఎక్కువ ఎత్తులో విహరించగలిగే ఈ డ్రోన్లు ఏకబిగిన సుమారు 40 గంటలకుపైగా గాల్లో ఉండగలవు. ఇవి నాలుగు హెల్ఫైర్ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు. ఇప్పటికే భారత్లో వీటిల్లో మరోరకమైన సీగార్డియన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని కూడా జనరల్ అటామిక్స్ నుంచి లీజ్పై భారత్ తీసుకొంది. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్టు ముగియగా.. మన నౌకాదళం మరో నాలుగేళ్లపాటు దీనిని పొడిగించింది.
(The above story first appeared on LatestLY on Oct 15, 2024 02:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

