Covid in India: గంగానదిలో తేలిన కరోనా శవాలు, మా దగ్గర లెక్కలు లేవని తెలిపిన కేంద్రం, కోవిడ్ సెకండ్ వేవ్‌లో గంగానది తీరం వెంబడి ఎన్నో మృతదేహలు వెలుగులోకి..
Family members wearing PPE kits perform the last rites of a Covid-19 victim in Jammu. (PTI Photo)

New Delhi, Feb 7: కరోనావైరస్ సెకండ్ వేవ్ లో యూపీ నుంచి బీహార్ వరకు గంగా తీరంలో పదుల సంఖ్యలో తేలియాడిన మృతదేహాలను (Information on bodies dumped in Ganga ) వెలికి తీశారు. అలా ఎన్ని మృతదేహాలు బయటపడ్డాయన్న దానిపై తమ వద్ద కచ్చితమైన సమాచారం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం నేడు రాజ్యసభకు తెలియజేసింది.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు జల్ శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తాడు బదులిస్తూ.. గంగానదిలో పడేసిన ‘కొవిడ్’ మృతదేహాల సంఖ్యపై ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమాచారం లేదని తెలిపారు. క్లెయిమ్ చేసుకోనివి, గుర్తించనవి, పూర్తిగా కాలినవి, సగం కాలిన మృతదేహాలు నదీ తీరంలో లభ్యమైనట్టు గుర్తించినట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్, బీహార్ జిల్లాల్లో ఈ ఘటనలు జరిగినట్టు వివరించారు. దీనికి సంబంధించి స్వాధీనం చేసుకున్న మృతదేహాలు, డిస్పోజ్ చేసిన వాటికి సంబంధించిన వివరాల కోసం ఆయా రాష్ట్రాలను సంప్రదించినట్టు చెప్పారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ'బ్రియన్ మాట్లాడుతూ.. గంగలో పడేసినట్లు అంచనా వేయబడిన COVID-19 సంబంధిత మృతదేహాల సంఖ్యను తెలియజేయాలని జల్ శక్తి మంత్రిని కోరారు. కోవిడ్-19 ప్రోటోకాల్‌ల ప్రకారం మృతదేహాలను తొలగించడానికి, వాటిని పారవేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమాచారాన్ని కూడా TMC నాయకుడు కోరాడు.

తెలంగాణ ఇచ్చినా మిమ్మల్ని అక్కడ ఈడ్చి తన్నారు, ఇంకో వందేళ్లు అయినా మీరు అధికారంలోకి రాలేరు, కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తిన ప్రధాని మోదీ

రాజ్యసభలో TMC MP యొక్క ప్రశ్నకు జూనియర్ జల్ శక్తి మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పందిస్తూ: "గంగా నదిలో పడేసినట్లు అంచనా వేయబడిన COVID-19 సంబంధిత మృతదేహాల సంఖ్యకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని కొన్ని జిల్లాల నుండి "క్లెయిమ్ చేయని / గుర్తించబడని, కాలిన లేదా పాక్షికంగా కాలిపోయిన మృతదేహాలు" గంగా నది ఒడ్డున తేలుతున్న సంఘటనలు నమోదయ్యాయని మంత్రి చెప్పారు.

అంతకుముందు, జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) మృతదేహాల గురించి, మృతదేహాల సరైన నిర్వహణ, పారవేయడం కోసం తీసుకున్న చర్యలపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివరణాత్మక నివేదికను కోరింది. దీనికి సంబంధించి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శులకు కూడా సలహాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

CAA నిరసన సమయంలో మరణించిన 22 మంది కంటే నా ప్రాణం విలువైనదేమి కాదు, జడ్‌ కేటగిరి అవసరం లేదని తెలిపిన అసదుద్దీన్‌ ఒవైసీ

రెండవ కోవిడ్ వేవ్ సమయంలో "ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన వారిపై ఎటువంటి డేటా లేదు" అని పార్లమెంటులో కేంద్రం చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీసిన నెలల తర్వాత ఈ ప్రకటన ప్రతిపక్షాల నుండి ఎదురవడం ఇప్పుడు అనేక విమర్శలకు తావిస్తోంది. గత సంవత్సరం ఏప్రిల్-మేలో రెండవ కోవిడ్ వేవ్ సమయంలో, కోవిడ్-19 పేషెంట్లుగా అనుమానించబడిన అనేక మృతదేహాలు గంగలో తేలుతూ కనిపించాయి. అప్పుడు ఇది రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ఘటనలు అమానవీయమని, నేరమని, దీనిపై హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా గతంలో డిమాండ్‌ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ అంశంలో ఘోరంగా విఫలమైనందుకు యుపి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు.