Flooding In Delhi: భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం.. వరదధాటికి నీట మునిగిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్.. ముగ్గురు విద్యార్థులు మృతి

భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతున్నది. వరదధాటికి హస్తిన ప్రజలు అస్తవ్యస్తం అవుతున్నారు. నగరంలోని రాజేందర్ నగర్‌ లో ఉన్న ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బేస్‌మెంట్‌ లోకి వరద పోటెత్తడంతో విద్యార్థులు చిక్కుకుపోయారు.

Flooding In Delhi: భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం.. వరదధాటికి నీట మునిగిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్.. ముగ్గురు విద్యార్థులు మృతి
Flooding In Delhi

Newdelhi, July 28: భారీ వర్షాలకు (Heavy Rains) దేశ రాజధాని ఢిల్లీ (Delhi) అతలాకుతలం అవుతున్నది. వరదధాటికి హస్తిన ప్రజలు అస్తవ్యస్తం అవుతున్నారు. నగరంలోని రాజేందర్ నగర్‌ లో ఉన్న ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బేస్‌మెంట్‌ లోకి వరద పోటెత్తడంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే ముగ్గురు విద్యార్థులు మరణించడం దురదృష్టకరం. మృతదేహాలను వెలికితీసిన అధికారులు.. ఇతరుల కోసం గాలిస్తున్నారు. అయితే, బేస్‌ మెంట్‌ లో వెలుతురు లేకపోవడం, నీరు నిండిపోవడం.. సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది.

తెలంగాణ కొత్త గవర్నర్‌ గా జిష్ణుదేవ్‌ వర్మ.. తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు.. మహారాష్ట్ర గవర్నర్‌ గా నియమితులైన సీపీ రాధాకృష్ణన్‌

పరారీలో కోచింగ్ సెంటర్ ఓనర్

ప్రమాద ఘటన తెలియగానే, కోచింగ్ సెంటర్ ఓనర్ పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా సీనియర్ అధికారులు ఘటనా స్థలంలోనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రాజకీయంగా ఈ ఘటన పెద్ద దుమారాన్ని రేపుతున్నది.

ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 9.15 వ‌ర‌కు కొన‌సాగిన తెలంగాణ అసెంబ్లీ, అంశాల వారీగా అధికార ప‌క్షానికి హ‌రీష్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).