Vijaya Malya and Karnataka High court (ANI and Wikimedia Commons)

Bengaluru, Feb 05: బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు బుధవారం (ఫిబ్రవరి 5, 2025) రుణ రికవరీ అధికారికి, 10 బ్యాంకులకు నోటీసు జారీ చేస్తూ ఆదేశాలు (HC on Vijay Mallya’s Plea) జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణకు ఆదేశించిన కర్ణాటక హైకోర్టు, తాను చెల్లించాల్సిన మొత్తం మొత్తానికి, యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (UBHL), ఇతర సర్టిఫికేట్ రుణగ్రస్తులకు చెల్లించాల్సిన వడ్డీతో పాటు, మునుపటి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ అప్పుల రికవరీ ప్రక్రియలో ఇప్పటివరకు వసూలు చేసిన మొత్తానికి సంబంధించిన ఖాతాల స్టేట్‌మెంట్‌ను అందించాలని (debt recovery details) బ్యాంకులను ఆదేశించింది.

ఇప్పటికైనా నన్ను గుర్తించరేం, నా మొర ఆలకించమంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, మొత్తం అప్పు తిరిగి చెల్లిస్తానంటూ ట్వీట్, ట్విట్టర్ ద్వారా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు వినతి

తాను వ్యాపార నిమిత్తం భారత్‌లోని పలు బ్యాంకుల్లో చేసిన అప్పు కంటే.. అవి తన వద్ద నుంచి వసూలు చేసిన మొత్తం ఎన్నో రేట్లు ఎక్కువగా ఉందని, కాబట్టి రికవరీ చేసిన మొత్తానికి సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్‌ను (Karnataka High Court issues notice to banks) అందించేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని మాల్యా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన జస్టిస్ ఆర్. దేవదాస్ తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు. ఈ రోజు విచారణలో బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇప్పటికే రికవరీ చేసినప్పటికీ, మాల్యాపై అదనపు రికవరీ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని మాల్యా తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య వాదించారు.

మీ డబ్బులు పైసాతో సహా చెల్లిస్తా..నన్ను వదిలేయండి

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మరియు దాని హోల్డింగ్ కంపెనీ UBHL (లిక్విడేషన్‌లో ఉంది) పై జారీ చేసిన వైండింగ్ అప్ ఆర్డర్, అలాగే ప్రాథమిక రుణగ్రహీత కింగ్‌ఫిషర్ మరియు దాని హామీదారు అయిన UBHL నుండి ₹6,200 కోట్ల మొత్తానికి రుణ రికవరీకి సమాంతర ప్రక్రియ చట్టబద్ధంగా తుది దశకు చేరుకుందని శ్రీ పూవయ్య ఎత్తి చూపారు. 2017 నుండి రుణం అనేకసార్లు వసూలు చేయబడిందని శ్రీ పూవయ్య వాదించారు.కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.6,200 కోట్ల అప్పు చేసిందని.. అందుకు బ్యాంకులు రూ.14,000 కోట్లు రికవరీ చేశాయని అన్నారు.

ఈ విషయం గురించి లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ తెలిపారు. మాల్యాకు చెందిన రూ.14, 131 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులు రికవరీ చేశాయని, ఆయన తీసుకున్న రుణంలో దాదాపు రూ.10, 200 కోట్లు చెల్లించినట్లు రికవరీ అధికారి కూడా తెలిపారు. కాబట్టి బ్యాంకులు తీసుకునే తదుపరి రికవరీ చర్యలపై తాత్కాలిక స్టే విధించాలని, అన్నీ బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లు అందించాలని మాల్యా తరపు న్యాయవాది కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ అంశంపై స్పందించాలంటూ ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సహా 10 బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13లోగా స్పందన తెలియజేయాలంటూ గడువు విధించింది.