'Modi Idlis': మోదీ ఇడ్లిస్, 10 రూపాయలకే నరేంద్ర మోదీ ఇడ్లీస్ ప్లేట్, తమిళనాడు సేలం వద్ద ప్రజలకు అందించడానికి రెడీ అవుతున్న బీజేపీ, వైరల్ అవుతున్న పోస్టర్లు

తమిళనాడులో ఇప్పటిదాకా అమ్మ క్యాంటిన్లు, అమ్మ ఇడ్లీలు.. ఇలా అనేక పథకాలను చూసి ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా ఈ వరసలో చేరింది. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Modi) పేరిట ₹ 10 ధర గల "మోడీ ఇడ్లిస్" (Modi Idlis) రెడీ అవుతున్నాయి. బిజెపి సీనియర్ కార్యనిర్వాహక సౌజన్యంతో తమిళనాడు సేలం (Tamil Nadu Salem) వద్ద ప్రజలకు అందించడానికి ఇది సిద్ధంగా ఉంది.

'Modi Idlis': మోదీ ఇడ్లిస్, 10 రూపాయలకే నరేంద్ర మోదీ ఇడ్లీస్ ప్లేట్, తమిళనాడు సేలం వద్ద ప్రజలకు అందించడానికి రెడీ అవుతున్న బీజేపీ, వైరల్ అవుతున్న పోస్టర్లు
Idly Coupon (Photo Credits: Twitter|@Mahesh10816)

Coimbatore, Sep 1: తమిళనాడులో ఇప్పటిదాకా అమ్మ క్యాంటిన్లు, అమ్మ ఇడ్లీలు.. ఇలా అనేక పథకాలను చూసి ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా ఈ వరసలో చేరింది. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Modi) పేరిట ₹ 10 ధర గల "మోడీ ఇడ్లిస్" (Modi Idlis) రెడీ అవుతున్నాయి. బిజెపి సీనియర్ కార్యనిర్వాహక సౌజన్యంతో తమిళనాడు సేలం (Tamil Nadu Salem) వద్ద ప్రజలకు అందించడానికి ఇది సిద్ధంగా ఉంది.

బిజెపి ప్రచార సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్ ఆలోచనతో ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం ఇవ్వడంలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో "మోడీ ఇడ్లీ" పోస్టర్లు ఉంచారు. పోస్టర్లలో ఎడమ వైపున ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యలో రాసిన 'రూ.10 కి నాలుగు ఇడ్లీలు', అలాగే కుడివైపున మహేష్ ఛాయాచిత్రం ఉన్నాయి.

"లోకల్ బీజేపీ నేత మహేష్ మోడీ ఇడ్లీని అందించనున్నారు. సాంబార్‌తో కలిపి ₹ 10 కోసం నాలుగు ఇడ్లీలను త్వరలో సేలం లో ప్రవేశపెట్టనున్నారు. వీటిని ఆధునిక వంటగది పరికరాలతో తయారు చేస్తారు, అలాగే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైనది" అని పోస్టర్లలో రాసారు. కాగా సేలం తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి ( K Palaniswami) సొంత జిల్లా. సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు‌, కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు సర్కారు

Idly Coupon: 

అక్కడ బీజేపీ ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బిజేపి తమిళనాడు కార్యదర్శి మాట్లాడుతూ ఇడ్లీలను విక్రయించడానికి ప్రారంభంలో 22 దుకాణాలను తెరవాలని యోచిస్తున్నారని, దాని విజయాన్ని బట్టి అవుట్ లెట్ల సంఖ్య పెరుగుతుందని చెప్పారు.రోజుకు 40,000 ఇడ్లీలను తయారుచేసే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన యంత్రాలు ఇప్పటికే వచ్చాయని, వచ్చే వారం ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Sep 01, 2020 10:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).