Mukesh Ambani Overtakes Gautam Adani: గౌతం అదానీని వెనక్కి నెట్టేసిన ముఖేష్ అంబానీ, 84.3 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా బిలియనీర్
Reliance Jio Launches UPI Payments Service on My Jio App to Take on PhonePe Google Pay in India(Photo-PTI)

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, బిలియనీర్ ముఖేష్ అంబానీ సంపదలో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీని వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం 84.3 బిలియన్‌ డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా అవతరించారు. గౌతమ్‌ అదానీ 83.9 బిలియన్‌ డాలర్ల సంపదతో అంబానీ తర్వాత స్థానానికి పడిపోయారు. ఈ మేరకు ఫోర్బ్స్‌ సంస్థ రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ -2023 జాబితాను వెల్లడించింది.

ఒక్క రోజులో రూ.48.600 కోట్ల మేర తుడిచి పెట్టుకు పోయిన గౌతం అదానీ ఆస్తులు, నంబర్ వన్ నుంచి ఏడవ స్థానానికి పడిపోయిన బిలియనీర్

అంబానీ సంపద 0.19 శాతం వృద్ధితో 164 మిలియన్‌ డాలర్‌లు పెరుగగా, అదానీ సంపద 4.62 శాతం నష్టంతో 84.1 బిలియన్‌ డాలర్‌లు కరిగిపోయిందని ఫోర్బ్స్‌ పేర్కొన్నది. ఇటీవల హిండెన్‌ బర్గ్‌ నివేదిక అదానీ గ్రూప్‌లో లొసుగులను బయటపెట్టడంతో ఆ సంస్థ షేర్‌లు భారీ నష్టాలు మూటగట్టుకుంటున్నాయి.

కుప్పకూలిపోతున్న అదానీ సామ్రాజ్యం, కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన LIC, భారీ నష్టాలపై స్పందించిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్

దాంతో ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్‌ అదానీ 10వ స్థానానికి పడిపోయారు. అదానీ కంటే అంబానీ ఒక అడుగు ముందుకేసి 9వ స్థానంలో కొనసాగుతున్నారు.