N-95 Mask Warning: ఎన్‌–95 మాస్కులతో కరోనా వస్తోంది, హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం, గుడ్డతో తయారు చేసిన మాస్కులు వాడటమే ఉత్తమమంటూ సూచన

కరోనావైరస్ నుండి రక్షణ కోసం ఉపయోగించే ఎన్‌–95 మాస్క్‌ల వినియోగంపై (N-95 Mask Warning) కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని (COVID-19) ఈ మాస్క్ అడ్డుకోలేదని, ఇంకా చెప్పాలంటే ఈ మాస్క్ వల్లే వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు. ముఖ్యంగా రెస్పిరేటరీ వాల్వ్‌లున్న ఎన్‌–95 మాస్క్‌లను (N-95 Mask) వినియోగించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.

N-95 Mask Warning: ఎన్‌–95 మాస్కులతో కరోనా వస్తోంది, హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం, గుడ్డతో తయారు చేసిన మాస్కులు వాడటమే ఉత్తమమంటూ సూచన
Coronavirus in India | (Photo Credits: PTI)

New Delhi, July 21: కరోనావైరస్ నుండి రక్షణ కోసం ఉపయోగించే ఎన్‌–95 మాస్క్‌ల వినియోగంపై (N-95 Mask Warning) కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని (COVID-19) ఈ మాస్క్ అడ్డుకోలేదని, ఇంకా చెప్పాలంటే ఈ మాస్క్ వల్లే వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు. ముఖ్యంగా రెస్పిరేటరీ వాల్వ్‌లున్న ఎన్‌–95 మాస్క్‌లను (N-95 Mask) వినియోగించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. కరోనా వ్యాక్సిన్‌పై చిగురిస్తున్న కొత్త ఆశలు, ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ప్రకటించిన ఆక్స్‌ఫర్డ్, ట్వీట్ చేసిన ది లాన్సెట్ ఎడిటర్

వైద్యసిబ్బంది వినియోగానికి ఉద్దేశించిన మాస్క్‌లను అనుచిత రీతిలో సామాన్య ప్రజలు వినియోగిస్తున్న తీరు తమ దృష్టికి వచ్చిందని ఆ లేఖలో ఆరోగ్య శాఖకు చెందిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ పేర్కొంది. ఇంట్లో తయారు చేసుకునే మాస్క్‌లను వినియోగించేందుకు మార్గదర్శకాలు ఆరోగ్య శాఖ వెబ్‌సైట్లో ఉన్నాయని, వాటిని ప్రచారం చేయాలని సూచించింది. సాధారణ మాస్కులను ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

కవాటాలు (వాల్వ్స్) ఉన్న మాస్కులు ధరించడాన్ని ఇప్పటికే పలు దేశాలు నిషేధించాయి. ఈ మాస్కులను పరిశ్రమల్లో తయారు చేసేవారు వినియోగిస్తారు. ఇవి వాతావరణంలో గాలిని శుద్ధి చేసి మనిషికి అందిస్తాయి. కానీ అదే సమయంలో మనం వదిలిన గాలి నేరుగా బయటకు వచ్చేస్తుంది. దీంతో వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది. ఇలా చేయడంవల్ల వైరస్ కట్టడికి మాస్కులను ధరించాలన్న నియమ నిబంధనలకు అర్థమే లేకుండా పోతుంది అని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పేర్కొంది. బీహార్‌లో పేషెంట్ల పక్కనే కరోనా మృత‌దేహం, దేశంలో 24 గంటల్లో 37,418 కోవిడ్-19 కేసులు నమోదు, 11,55,191కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

అన్నిటికీ మించి వస్త్రంతో తయారు చేసిన మాస్కులే (home-made face masks) అత్యుత్తమైనవిగా అభివర్ణించింది. శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా సహా అమెరికాలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. మాస్క్ ధరించి బయటకు వెళ్లి రాగానే వేడి నీటిలో 5 నిమిషాల పాటు ఉంచి ఆరబెట్టాలని చెప్పింది. ఎవరి మాస్క్ వారే ధరిస్తూ శుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది.

కాగా వాల్వ్ ఉండే మాస్కులు వైరస్‌లను అడ్డుకోవడానికి తయారుచేసినవి కావు. పరిశ్రమలలో కాలుష్యం ఉండే ప్రాంతాల్లో పనిచేసేవాళ్లు ఇలాంటి మాస్కులు వాడతారు. ఈ వాల్వ్ ఏం చేస్తుందంటే... మనిషి పీల్చే గాలిని ఫిల్టర్ చేసి... మంచి ఆక్సిజన్‌ను ముక్కుకు అందిస్తుంది. అలాగే... మనం విడిచే గాలిని... ఈ వాల్వ్ బయటకు వదిలేస్తుంది. అందుకు ఇలాంటి మాస్కులు ఉపయోగపడతాయే తప్ప... ఇవి కరోనా వైరస్‌ని ఆపలేవని నిపుణులు చెబుతున్నారు.

రెండు మూడు లేయర్లు కలిగిన గుడ్డతో తయారు చేసిన మాస్కులను ధరిస్తే, బ్రీత్ ఔట్ గాలి బటయకువెళ్లినా, కరోనా వైరస్ మాస్క్ గుడ్డను దాటి బయటకు వెళ్లలేదని చెబుతున్నారు. వాల్వ్ ఉన్న మాస్కులు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి కానీ, కరోనా వైరస్ ను కంట్రోల్ చేయలేవని, గుడ్డతో తయారు చేసిన మాస్కులు వాడటం ఉత్తమమని చెబుతున్నారు.

మార్కెట్లో ముసుగుల అధిక ధరను పేర్కొంటూ, మహారాష్ట్ర ప్రభుత్వం ఫేస్ మాస్క్‌లు మరియు హ్యాండ్ శానిటైజర్ల ధరలను నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. "కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ముసుగులు మరియు శానిటైజర్ల వాడకం పెరిగింది. వాటి ధరలను నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. సామాన్య ప్రజలకు ఉపశమనం ఇవ్వాలి" అని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే అన్నారు.

ఫేస్ మాస్క్ ధరించడం మరియు పారవేయడం ఎలా అనే దానిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ఒక వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. ముసుగు ధరించే ముందు కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను కూడా ఉపయోగించవచ్చు. ఫేస్ కవర్ సరిగ్గా సరిపోయేలా ఉండాలి, ఒకరి నోరు, ముక్కు మరియు గడ్డం కప్పబడి ఉంటుందని వైద్య మండలి తెలిపింది. ప్రతి ఎనిమిది గంటల తర్వాత ముసుగు మార్చాలి. తడి ముసుగులు మానుకోవాలి. ముసుగు పూర్తయినప్పుడు క్లోజ్డ్ బిన్లో పారవేయాలి. ఫేస్ కవర్‌ను పారవేసిన తర్వాత చేతులు కడుక్కోవాలి. ఫేస్ మాస్క్‌లు పంచుకోకూడదు. COVID-19 కు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతి ఒక్కరూ తమ ముసుగును ఉపయోగించాలి.

(The above story first appeared on LatestLY on Jul 21, 2020 01:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).