PM Modi 5th Video Conference: మన ముందు పెద్ధ ఛాలెంజ్ ఉంది, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రారంభమైన ప్రధాని మోదీ 5వ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం (PM Modi 5th Video Conference) కొనసాగుతోంది. ఈ సమావేశంలొ రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పనిచేసి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం మన ముందు ఓ ఛాలెంజ్ ఉందని సీఎంలతో మోదీ వ్యాఖ్యానించారు. సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటం (PM Narendra Modi's 5th Video Conference With Chief Ministers) ఇది ఐదవసారి.
New Delhi, May 11: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం (PM Modi 5th Video Conference) కొనసాగుతోంది. ఈ సమావేశంలొ రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పనిచేసి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం మన ముందు ఓ ఛాలెంజ్ ఉందని సీఎంలతో మోదీ వ్యాఖ్యానించారు. సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటం (PM Narendra Modi's 5th Video Conference With Chief Ministers) ఇది ఐదవసారి. కరోనాతో 2206 మంది మృతి, దేశ వ్యాప్తంగా 67,152కి చేరిన కరోనావైరస్ కేసుల సంఖ్య, యాక్టివ్గా 44,029 కేసులు, నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోన్న క్రమంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో తీవ్ర నిధుల కొరతను ఎదుర్కుంటున్న పలు రాష్ట్రాల సీఎంలు ఆర్థిక ప్యాకేజ్ను కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
మే 17న లాక్డౌన్ (India Lockdown) గడువు ముగుస్తుండటంతో తదుపరి ఎలాంటి వ్యూహం అనుసరించాలనే విషయంపై ప్రధాని సీఎంల అభిప్రాయం కోరుతున్నారు. ఇక మే 17 తర్వాత విమాన సర్వీసుల పునరుద్ధరణపైనా ప్రధాని ఈ భేటీలో కీల ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఈ సమావేశంలో భారత్లోని గ్రామాలకు కరోనా వైరస్ వ్యాపించకుండా చేయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యమని ప్రధాని మోదీ సీఎంలతో అన్నట్లుగా తెలుస్తోంది.
PM-CMs Video-Meet Begins
Prime Minister Narendra Modi's 5th video conference meeting with Chief Ministers, begins. #COVID19 pic.twitter.com/OWriGpL8VC
— ANI (@ANI) May 11, 2020
లాక్డౌన్ కొనసాగించాలా లేదా సామాజిక దూర నిబంధనల రైడర్తో సడలింపులను ప్రకటించాలా అనే దానిపై రాష్ట్ర సిఎంలతో కలిసి మోడీ సమావేశం నిర్వహిస్తున్నారు. గ్రీన్ జోన్లుగా నియమించబడిన దేశంలోని అనేక ప్రాంతాల్లో, పరిమితమైన ప్రజా రవాణా, దుకాణాల్లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇప్పటికే అనుమతించారు.కాగా ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) ముఖ్యమంత్రులందరినీ చర్చలో పాల్గొనమని ఆహ్వానించింది. వారి అభిప్రాయాలు తెలపాలని కోరింది. వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. ఈ రాజధాని రూట్లలో 15 రైళ్లు తిరుగుతాయి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే రైళ్ల వివరాలు, అలాగే రేపటి నుంచి పట్టాలెక్కే రైళ్ల వివరాలు, బుకింగ్ ప్రాసెస్ మీకోసం
దేశంలో ప్రధాన ప్రయాణ మార్గంగా ఉన్న భారతీయ రైల్వే, ప్రయాణీకుల సేవలను క్రమంగా తిరిగి ప్రారంభించడానికి అనుమతించబడింది. మే 12 నుంచి రైల్వే న్యూఢిల్లీ నుంచి 15 రైళ్లను నడుపుతుంది. రాబోయే రోజుల్లో రైళ్ల సంఖ్యను పెంచుతామని, సాధారణ సర్వీసులను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ప్రయాణీకులు కఠినమైన సామాజిక దూర నిబంధనలకు కట్టుబడి ఉండాలని తెలిపింది.
సాధారణ స్థితిని పునరుద్ధరించాలనే ఆలోచన ఉన్నప్పటికీ, భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య తారాస్థాయికి చేరుకుంది. గత 24 గంటలలో 4,213 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 67,152 కు చేరుకుంది మరియు మరణాల సంఖ్య 2,206 కు పెరిగింది.
(The above story first appeared on LatestLY on May 11, 2020 04:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

