Coronavirus in Maharashtra: ఐసోలేషన్ నుండి పరార్, కరోనాతో 17 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరిన వృద్ధుడు, ఫ్యామిలీ అంతా క్వారంటైన్‌లోకి, పుణేలో ఘటన
Pune COVID-19 (Photo-ANI)

Pune, April 29: డెభ్బై ఏళ్ల COVID-19 రోగి పూణేలోని బాలేవాడి ప్రాంతంలోని ఒక ఐసోలేషన్  నుండి పారిపోయాడు. యార్వాడాలోని తన ఇంటికి చేరుకోవడానికి దాదాపు 17 కిలోమీటర్లు నడిచాడు. రోగులకు ఆహారాన్ని అందించకపోవడం,వాష్‌రూమ్‌ల క్లీన్ వంటి మౌలిక సదుపాయాలు లేనందున తాను అక్కడి నుంచి పారిపోయి (Flees Isolation Facility) వచ్చానని కరోనా సోకిన వృద్ధుడు (COVID-19 Patient) తెలిపారు. ఈ ఘటన ఫుణేలో జరిగింది. వణికిస్తున్న ముంబై మురికివాడ ధారావి, కొత్తగా 42 పాజిటివ్ కేసులు, ఇండియాలో 31 వేలకు పైగా కోవిడ్-19 కేసులు, ఇండోనేషియాకు ప్రధాని మోడీ భరోసా

అతను నేరుగా ఇంటికి చేరుకున్నప్పటికీ అక్కడ ఇంటికి తాళం ఉండటంతో బయటే కూర్చుండిపోయాడు. ఇదిలా ఉంటే అతని కుటుంబ సభ్యులు అందరూ  కరోనా అనుమానంతో క్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో ఇంటిముందు కూర్చున్న వృద్ధుడిని ఇరుగుపొరుగు పసిగట్టారు. వృద్ధునికి కరోనా ఉందన్న సంగతి తెలుసుకున్న స్థానికులు అధికారులకు కబురు పెట్టారు.

వృద్ధుని కొడుకు (అతనికి కూడా పాజిటివ్ ఉంది) వచ్చి తండ్రిని ఒప్పించి తీసుకువెళ్లాడు. మొత్తంమీద వృద్దుడిని అంబులెన్స్‌లో తిరిగి ఐసోలేషన్ సెంటర్‌కు పంపించి అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని యరవాడ ఏరియా కార్పొరేటర్ సిద్ధార్థ్ ధెండే మీడియాకు తెలిపారు.  సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు క‌రోనా వైర‌స్, లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టుకున్న క‌రోనా భ‌యం

"వృద్ధుడిని వెంటనే పునరావాసం కల్పించాలని నేను అధికారులకు సమాచారం ఇచ్చాను. అతను అదృశ్యమయ్యాడని పౌర అధికారులకు కూడా తెలియదని నేను తెలుసుకున్నాను. అతను అనుమానాస్పదమైన కరోనావైరస్ కేసు కావడంతో మొదట ఏప్రిల్ 24 న ఖరాడిలోని రక్షక్నగర్ నిర్బంధ కేంద్రానికి పంపబడ్డాడు. మరుసటి రోజు, అతనికి కరోనా అని తేలడంతో అతన్ని బాలేవాడి యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (NICMAR) సౌకర్యానికి మార్చారు "అని కార్పొరేటర్ చెప్పారు. దిగ్బంధం సౌకర్యాలలో ప్రాథమిక సదుపాయాలు లేకపోవడం గురించి ధేండే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఉన్నత అధికారులను కార్పోరేటర్ కోరారు.