Weather Forecast: ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు, పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్, వచ్చే 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచన
Representational Picture

New Delhi, Mar 23: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వర్షం, ఈదురు గాలులు శుక్రవారం వరకు కొనసాగే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ((IMD issues orange alert) ) ప్రకటించింది.రాజస్థాన్, పంజాబ్(Punjab, Rajasthan) రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఐఎండీ అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీఘడ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

హైదరాబాద్‌కు భారీ వర్షసూచన, రానున్న రెండు రోజుల్లో ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ, అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని హెచ్చరిక

బుధవారం రాజస్థాన్, పంజాబ్‌లో వర్షం కొనసాగింది. తాజా వడగళ్ల వానతో IMD రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సుందరనగర్,మండీ, డల్ హౌసీ, చౌరీ, ధర్మశాల, కర్సాగ్ ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురిశాయి.ఉనా,కంగ్రా, సిమ్లా, సోలన్ సకనాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

మార్చి 23 మరియు 24 తేదీలలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌లలో తాజా వర్షపాతం, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.వాతావరణ శాఖ ప్రకారం, హిమాచల్ ప్రదేశ్‌లోని కద్రాలా, గోండ్లతో సహా ఎత్తైన ప్రాంతాలలో బుధవారం తేలికపాటి మంచు కురిసింది. రాష్ట్రంలోని దిగువ కొండల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

ఢిల్లీలో స్వల్ప భూకంపం, భయంతో పరుగులు తీసిన ప్రజలు, హర్యానాలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తింపు

పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలో బలమైన గాలులతో కురిసిన వడగండ్ల వర్షం వల్ల పంట నష్టం జరిగింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోధుమ పంటకు జరిగిన నష్టాన్ని తెలుసుకోవడానికి సర్వే చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధికారులను ఆదేశించారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈశాన్య భారతదేశంలో ఉరుములతో కూడిన మెరుపులు, గాలులతో కూడిన తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతంలో ఎల్లో అలర్ట్(YELLOW ALERT FOR ANDHRA) జారీ చేశారు.

ఆంధ్ర, ఈశాన్య రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్

రాబోయే కొద్ది రోజుల్లో ఈశాన్య భారతదేశంలో ఉరుములతో కూడిన మెరుపులు, గాలులతో కూడిన తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం మరియు మేఘాలయలలో ఒంటరిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు , మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు వచ్చే ఐదు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది తేలికపాటి వర్షాలు వచ్చే ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున పంటల సాగును నిలిపివేయాలని IMD రైతులను కోరింది. తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.