Haryana CM Khattar: కరోనాతో చనిపోయిన వారు మళ్లీ బతకరు, ఆ మరణాలపై ఆందోళన ఎందుకు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ పలువురి ప్రాణాల‌ను హ‌రిస్తూ ప్రాణాంతకంగా మారిన నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ (Haryana Chief Minister Manohar Lal Khattar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 సంబంధిత మరణాల గురించి ఆందోళన చెందడంలో (no point debating death data) అర్థం లేదన్నారు

Haryana CM Khattar: కరోనాతో చనిపోయిన వారు మళ్లీ బతకరు, ఆ మరణాలపై ఆందోళన ఎందుకు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
Haryana CM Manohar Lal Khattar (Photo Credits: ANI)

New Delhi, April 27: క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ పలువురి ప్రాణాల‌ను హ‌రిస్తూ ప్రాణాంతకంగా మారిన నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ (Haryana Chief Minister Manohar Lal Khattar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 సంబంధిత మరణాల గురించి ఆందోళన చెందడంలో (no point debating death data) అర్థం లేదన్నారు.

కొవిడ్ సంక్షోభంతో చోటు చేసుకుంటున్న మ‌ర‌ణాల‌తో మ‌నం చలించ‌కూడ‌ద‌ని, ప్ర‌జ‌లు కోలుకుని మంచి ఆరోగ్యంతో బ‌య‌ట‌ప‌డ‌టంపై కేంద్రీక‌రించాల‌ని అన్నారు. మ‌నం ఎంత అర‌చి మొత్తుకున్నా చ‌నిపోయిన వారు తిరిగిరార‌ని (The dead won’t come back) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

మంగళవారం సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ విలేకర్లతో మాట్లాడుతూ, ఇలాంటి సంక్షోభ సమయంలో మనం గణాంకాలపై ఆందోళన చెందకూడదన్నారు. ప్రజలు కోలుకుని, ఆరోగ్యవంతులవడానికి మనం ఎలా సహాయపడగలమో ఆలోచించాలన్నారు. వారికి ఎలా ఉపశమనం కలిగించాలనే విషయం గురించి ఆలోచించాలని చెప్పారు.

కరోనా విలయం, బాలాజీకి కొబ్బరికాయ కొట్టండి, ఆయనే అంతా చూసుకుంటాడు, వివాదాస్పదం అవుతున్న కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఓదార్పు వ్యాఖ్యలు, ట్విట్టర్‌లో వ్యాఖ్యలను సమర్థించుకున్న బీజేపీ సీనియర్ నేత

మనం ఎంత గగ్గోలు పెట్టినప్పటికీ మరణించినవారు మళ్ళీ బతకరని..ప్రజలను కాపాడటం కోసం అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్ని ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. దీనికోసం ప్రతి ఒక్కరి సహాయం అవసరమని, రోగుల సహకారం కూడా అవసరమని తెలిపారు.

Here's ANI Update

హర్యానాలో ఆక్సిజన్ లభ్యత గురించి మాట్లాడుతూ, రాష్ట్రానికి ఆక్సిజన్ కోటాను 162 మెట్రిక్ టన్నుల నుంచి 240 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందిని తాము ఎదుర్కొనడం లేదన్నారు. ప్రస్తుత ధోరణిని పరిశీలించి, కోటాను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జంషెడ్‌పూర్ నుంచి అదనంగా 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తెప్పించినట్లు తెలిపారు.

దేశంలో కోవిడ్ సంక్షోభం, కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, ప్రేక్షకుడిగా చూస్తూ ఉండలేమని తెలిపిన అత్యున్నత ధర్మాసనం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు

హర్యానాలోని హిసార్, పానిపట్‌లలో తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణం గురించి తెలుసుకునేందుకు అక్కడి ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్లను సందర్శిస్తానని చెప్పారు. ఈ ప్లాంట్ల వద్ద 500 పడకలతో ఆసుపత్రులను నిర్మిస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. వీటి నిర్మాణం బుధవారం నుంచి ప్రారంభమవుతుందన్నారు. మూడు, నాలుగు రోజుల్లో నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపారు. హ‌ర్యానాలో మొత్తం 4,31,981 కొవిడ్-19 కేసులు న‌మోద‌వ‌గా, 3842 మంది మ‌ర‌ణించారు. హర్యానాలో ప్ర‌స్తుతం 79,466 యాక్టివ్ కేసులున్నాయి.

(The above story first appeared on LatestLY on Apr 27, 2021 06:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).