Aadhaar Act: ఆధార్పై కేంద్రం కీలక నిర్ణయం, ఇకపై ఎవరైనా ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ. కోటి జరిమానా, నిబంధనలను నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం
ఆధార్ చట్టం ఆమోదించిన దాదాపు రెండేళ్ల తర్వాత ఆధార్ చట్టాన్ని (Aadhaar Act) ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఇకపై ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు (UIDAI Finally Gets Powers to Act ) తీసుకోవడానికి న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవడానికి అనుమతి ఇచ్చింది.
New Delhi, Nov 3: ఆధార్ చట్టం ఆమోదించిన దాదాపు రెండేళ్ల తర్వాత ఆధార్ చట్టాన్ని (Aadhaar Act) ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఇకపై ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు (UIDAI Finally Gets Powers to Act ) తీసుకోవడానికి న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవడానికి అనుమతి ఇచ్చింది. కోటి రూపాయల జరిమానా (Fines Up To Rs 1 Crore) విధించడానికి యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)కు వీలు కల్పించే విధంగా నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియమనిబంధనల ప్రకారం.. యూఐడీఏఐ ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవచ్చు. న్యాయనిర్ణేత అధికారులకు ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించే (Aadhaar Violations) సంస్థలు/వ్యక్తులపై విచారణ జరిపి రూ.1 కోటి వరకు జరిమానా విధించే అవకాశాన్ని కల్పించింది. న్యాయనిర్ణేత అధికారులు ఇచ్చిన తీర్పుపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే సదరు సంస్థలు టెలికాం వివాదాల పరిష్కారం, అప్పీలేట్ ట్రిబ్యునల్ను కూడా ఆశ్రయించవచ్చు.
ఈ నిబంధనలను తీసుకొనిరావడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్, ఇతర శాసనాల (సవరణ) బిల్లు, 2019కి ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ చట్టాలను అమలు చేయడానికి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి రెగ్యులేటర్తో సమానమైన అధికారాలు లభించాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యూజర్ల డేటకు మరింత రక్షణ లభిస్తుంది.
UIDAI (పెనాల్టీల తీర్పు) రూల్స్, 2021ని నవంబర్ 2న ప్రభుత్వం నోటిఫై చేసింది, దీని ప్రకారం UIDAI చట్టం లేదా UIDAI ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు ఆధార్ పర్యావరణ వ్యవస్థలోని ఒక సంస్థపై ఫిర్యాదును ప్రారంభించవచ్చు. UIDAIకి అవసరమైన సమాచారాన్ని అందించవచ్చు. UIDAIచే నియమించబడిన న్యాయనిర్ణేత అధికారులు అటువంటి విషయాలను నిర్ణయిస్తారు. అటువంటి సంస్థలపై రూ. 1 కోటి వరకు జరిమానాలు విధించవచ్చు.
న్యాయనిర్ణేత అధికారి, పెనాల్టీని నిర్ణయించే ముందు, ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపించబడిన వ్యక్తి లేదా సంస్థకు నోటీసు జారీ చేస్తారు, అతనిపై లేదా దానిపై ఎందుకు జరిమానా విధించకూడదో కారణాన్ని చూపవలసి ఉంటుంది. ఇది ఉల్లంఘన స్వభావాన్ని స్పష్టంగా సూచిస్తుంది, చట్టం ప్రకారం పాటించకపోవడం లేదా డిఫాల్ట్. న్యాయనిర్ణేత అధికారికి సాక్ష్యం ఇవ్వడానికి కేసు యొక్క వాస్తవాలు, దాని పరిస్థితులతో పరిచయం ఉన్న ఏ వ్యక్తినైనా పిలిపించి, హాజరుపరిచే అధికారం ఉంటుంది.
(The above story first appeared on LatestLY on Nov 03, 2021 03:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

