Lockdown Extension Suspense: లాక్‌డౌన్‌ పొడిగిస్తారా, ఎత్తేస్తారా, ఉత్కంఠ మధ్య క్యాబినెట్ మంత్రులతో ప్రధాని మోదీ భేటీ

రెండవ దశ కరోనావైరస్ లాక్‌డౌన్ (India Lockdown) ముగియడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, మే 3 తర్వాత లాక్ డౌన్ కొనసాగించాలా వద్దా (Lockdown Extension Suspense) అనే విషయం చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) హోంమంత్రి అమిత్ షాతో (HM Amit Shah) సహా ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.. లేక ఆంక్షలను సడలిస్తారా అనేది కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశంలో తేల్చాల్సి ఉంది.

Lockdown Extension Suspense: లాక్‌డౌన్‌ పొడిగిస్తారా, ఎత్తేస్తారా, ఉత్కంఠ మధ్య క్యాబినెట్ మంత్రులతో ప్రధాని మోదీ భేటీ
PM Narendra Modi and Cabinet meeting amid coronavirus lockdown. (Photo Credit: www.narendramodi.in)

New Delhi, May 1: రెండవ దశ కరోనావైరస్ లాక్‌డౌన్ (India Lockdown) ముగియడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, మే 3 తర్వాత లాక్ డౌన్ కొనసాగించాలా.. వద్దా (Lockdown Extension Suspense) అనే విషయం చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) హోంమంత్రి అమిత్ షాతో (HM Amit Shah) సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 35 వేలు దాటిన కరోనా కేసులు, కొత్తగా రెడ్, ఆరెంజ్ జోన్లను ప్రకటించిన కేంద్రం, దేశ వ్యాప్తంగా తగ్గిన రెడ్ జోన్ల సంఖ్య

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.. లేక ఆంక్షలను సడలిస్తారా అనేది కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశంలో తేల్చాల్సి ఉంది.

ప్రభుత్వం ముందు ఉన్న ప్రధాన నిర్ణయాలలో ఒకటి విమానయానం తెరవడం రెండవది రైల్వేలు నడపడం. వీటికి మినహాయింపులు ఇస్తే భారతదేశంలో ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. కనుక ఈ సమావేశంలో వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా లాక్‌డౌన్‌పై అనుసరించాల్సిన వ్యూహాలు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రముఖంగా చర్చిస్తున్నట్లు సమాచారం.  మే దినోత్సవం, కరోనా దెబ్బకు ప్రమాదకరంగా మారిన కార్మికుల ఉపాధి, పది కోట్ల మంది దారిద్య్రంలో మగ్గిపోతారని ప్రపంచ బ్యాంక్‌ ఆందోళన

సోమవారం నుండి అనేక జిల్లాలకు గణనీయమైన సడలింపు కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఉన్నప్పటికీ, లాక్డౌన్ సమస్యపై రాష్ట్రాలు అక్కడ ఉన్న కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చగా మూడు మండలాలుగా విభజించడంతో కంటైనర్ జోమ్‌లలో కదలిక చాలా కష్టంగా మారింది. ఈ సమావేశంలో పిఎం మోడీతో పాటు వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కూడా పాల్గొన్నారు. మద్యం షాపులు తెరవాల్సిందే..! ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్, అల్కాహాల్ సేవించడం వల్ల గొంతు నుండి కరోనావైరస్ తొలగిపోతుందని వాదన

లాక్డౌన్ (Lockdown) వ్యవధిని పొడిగించవచ్చని ఊహాగానాలు ఉన్నందున, వ్యాపారాన్ని తెరిచే అవకాశాలను కూడా ఈ సమావేశంలో పరిశీలిస్తున్నారు. అంతకుముందు బుధవారం, కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రదేశాలలో చిక్కుకొన్న లక్షలాది మంది వలస కార్మికులు మరియు విద్యార్థులను స్వదేశానికి తిరిగి రావడానికి అనుమతించింది. రాజస్థాన్ లోని కోటా నుండి ఒంటరిగా ఉన్న విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

కాగా ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్, పేదలకు మద్దతు ఇవ్వడానికి భారత ప్రభుత్వం రూ .65,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని, ఆర్థిక వ్యవస్థను త్వరగా తెరవాలని సూచించారు. ప్రజలకు ఉద్యోగాలు వచ్చే విధంగా వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

మరోవైపు కరోనాపై జరుగుతున్న పోరులో మే నెల అత్యంత కీలకమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. హాట్‌స్పాట్స్‌ను కఠినంగా నియంత్రించడం, గ్రీన్‌జోన్స్‌ను సురక్షితంగా కాపాడుకోవడమన్న రెండు అంశాలు అమీతుమీ తేల్చేస్తాయని అభిప్రాయపడ్డారు. రైల్వే, విమాన ప్రయాణం, అంతర్రాష్ట బస్సు సర్వీసులను మే నెల మొత్తం బంద్‌ చేయడమే మేలని స్పష్టం చేశారు.

(The above story first appeared on LatestLY on May 01, 2020 01:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).