'Muslims Are Not Kids to be Misguided': ముస్లింలు చిన్న పిల్లలు కాదు తప్పుదారి పట్టించడానికి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన అసదుద్దీన్ ఒవైసి, పోటాపోటీగా బీహార్ ఎన్నికల ప్రచారం

వివాదాస్పద పౌరసత్వం (సవరణ) చట్టంపై "కొంతమంది మా ముస్లిం సోదరులను తప్పుదారి పట్టించారు" అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి మండిపడ్డారు. “మేము చిన్న పిల్లలం కాదు మమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ’('Muslims Are Not Kids to be Misguided')అని ట్విట్టర్ వేదికగా కౌంటర్ విసిరారు. CAA + NRC ఏమి చేయాలో BJP సరైన విధంగా చెప్పలేదు. ఇది ముస్లింల గురించి కాకపోతే, మతం గురించి అన్ని సూచనలను చట్టం నుండి తొలగించండి ”అని ఒవైసీ (Asaduddin Owaisi) ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

'Muslims Are Not Kids to be Misguided': ముస్లింలు చిన్న పిల్లలు కాదు తప్పుదారి పట్టించడానికి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన అసదుద్దీన్ ఒవైసి, పోటాపోటీగా బీహార్ ఎన్నికల ప్రచారం
Asaduddin Owaisi - Mohan Bhagwat (Photo Credits: PTI)

New Delhi, October 25: వివాదాస్పద పౌరసత్వం (సవరణ) చట్టంపై "కొంతమంది మా ముస్లిం సోదరులను తప్పుదారి పట్టించారు" అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి మండిపడ్డారు.

“మేము చిన్న పిల్లలం కాదు  తప్పుదారి పట్టించడానికి ’('Muslims Are Not Kids to be Misguided')అని ట్విట్టర్ వేదికగా కౌంటర్ విసిరారు. CAA + NRC ఏమి చేయాలో BJP సరైన విధంగా చెప్పలేదు. ఇది ముస్లింల గురించి కాకపోతే, మతం గురించి అన్ని సూచనలను చట్టం నుండి తొలగించండి ”అని ఒవైసీ (Asaduddin Owaisi) ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

కాగా అంతకు ముందు రోజు, భగవత్ (Mohan Bhagwat), నాగ్‌పూర్‌లో జరిగిన సంఘ్  ర్యాలీలో మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్ ఏ ప్రత్యేక మత సమాజానికి వ్యతిరేకం కాదని, అయితే “కొంతమంది మా ముస్లిం సోదరులను తప్పుదారి పట్టించారని పేర్కొన్నారు.

అక్టోబర్‌ 28న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, 243 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్‌, నవంబర్‌ 10వ తేదీన ఓట్ల లెక్కింపు

దేశంలోని ముస్లిం జనాభాను తనిఖీ చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నట్లుగా CAA పై వ్యతిరేకత ఉంది. వాస్తవానికి, CAA కారణంగా భారతీయ పౌరులు ఎవరూ బెదిరించబడలేదు, ”అని ఆయన అన్నారు. ఈ అంశంపై మరింత చర్చించటానికి ముందు, మా దృష్టి కరోనావైరస్ వైపుకు మారింది, ఇది మిగతా అన్ని విషయాలను కప్పివేసిందని అన్నారు.

Asaduddin Owaisi Replies to Mohan Bhagwat on CAA:

పౌరసత్వ ప్రాతిపదికగా మతంతో ఉన్న చట్టాన్ని దేనినైనా సరే గట్టిగా నిరసిస్తామని AIMIM చీఫ్ నొక్కిచెప్పారు. కాగా అక్టోబర్ 28 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్న బీహార్‌లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిపై కూడా ఓవైసీ తీవ్రంగా విరుచుకుపడ్డారు."నేను కాంగ్రెస్, ఆర్జెడి వారికి చెప్పాలనుకుంటున్నాను. ఆందోళన సమయంలో మీ నిశ్శబ్దం మేము ఇంకా మర్చిపోలేదు. బిజెపి నాయకులు సీమాంచల్ ప్రజలను ‘ఘుస్పెతియే’ అని పిలుస్తుండగా, ఆర్జేడీ-ఐఎన్‌సి ఒక్కసారి కూడా నోరు విప్పలేదు, ”అని అన్నారు.

బీహార్‌లో పూర్తయిన సీట్ల పంపకం, కూటమి నేతగా తేజస్వీ యాదవ్‌ ఏకగ్రీవ ఎన్నిక

కాగా బీహార్‌లో జరగబోయే ఎన్నికలకు సమాజ్ వాదీ జనతాదళ్ (డెమొక్రాటిక్), ఉపేంద్ర కుష్వాహా ఆర్‌ఎల్‌ఎస్‌పి, బిఎస్‌పిలతో AIMIM ఒప్పందం కుదుర్చుకుంది.

(The above story first appeared on LatestLY on Oct 25, 2020 06:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).