Patna, October 17: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లి హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజాగా తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) నేతృత్వంలోని ‘మహాఘట్ బంధన్’ కూటమి శనివారం మేనిఫెస్టోను (Mahagathbandhan Manifesto) విడుదల చేసింది. తాము గనక అధికారంలోకి వస్తే.. మొదటి శాసనసభా సమావేశాల్లోనే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లును తీసుకొస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా (Randeep Singh Surjewala) హామీ ఇచ్చారు. ప్రతిపక్ష బీజేపీ ముగ్గురితో పొత్తులు పెట్టుకుని రంగంలోకి దిగిందని..జేడీయూ నితీశ్ కుమార్తో, ఒవైసీతో పొత్తులు పెట్టుకున్నారని మండిపడ్డారు.
ప్రజల దృష్టిని మరల్చడానికి భారతీయ జనతా పార్టీ వివాదాస్పద వ్యాఖ్యలను తెరపైకి తెస్తోందని, జాలే నియోజకవర్గానికి చెందిన తమ అభ్యర్థి ఎన్నడూ జిన్నాను పొగడలేదని స్పష్టం చేశారు. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థి నేతగా ఉన్న సమయంలో జిన్నా ఫొటోను తొలగించాలని ఆయన మోదీకి లేఖ రాశారని, అయినా మోదీ స్పందించలేదని సూర్జేవాలా తెలిపారు. వరదల కారణంగా రాష్ట్రం ఘోరంగా దెబ్బతింటే... ఇప్పటి వరకూ కేంద్ర బృందం వచ్చి పర్యటించిన పాపాన పోలేదని ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు.
దీనిని బట్టి చూస్తే అందరూ సీఎం కుర్చీని పొందడం కోసం తెగ బిజీ అయిపోయినట్లు తెలుస్తోందని తేజస్వీ ఎద్దేవా చేశారు. నితీశ్ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని, 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నా.... బిహార్ కు ప్రత్యేక హోదాను తీసుకురావడంలో విఫలం చెందారని తేజస్వీ విమర్శించారు.
ఇక అధికార జేడీయూని వ్యతిరేకిస్తూ బీజేపీకి మద్దతు పలుకుతున్న ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ మరోసారి విమర్శలకు దిగారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒత్తిడి మnt_resize_btn_blk col-sm-3 text-right no_pad">
- Read in
- English