Rajasthan Political Heat: రాష్ట్రపతి రంగంలోకి రావాలి, బీజేపీ నియమించిన గవర్నర్లు రాజ్యాంగాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నారు, రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై స్పందించిన కాంగ్రెస్ నేత చిదంబరం
రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశానికి పిలుపునివ్వడంపై రాజస్థాన్ గవర్నర్ కలరాజ్ మిశ్రా, సిఎం అశోక్ గెహ్లాట్ మధ్య కొనసాగుతున్న గొడవ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం (Senior Congress leader P Chidambaram) బీజేపీ పార్టీ మీద, గవర్నర్ల మీద ఫైర్ అయ్యారు. బిజెపి నియమించిన గవర్నర్లు (BJP-appointed governors) రాజ్యాంగ పరిధిలోని లేఖను మరియు ఆత్మను పదేపదే ఉల్లంఘించారని ఆరోపించారు. రాష్ట్రపతి (Ram nath kovind) జోక్యం చేసుకుని రాజస్థాన్ గవర్నర్కు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తారని చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు.
New Delhi, July 27: రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశానికి పిలుపునివ్వడంపై రాజస్థాన్ గవర్నర్ కలరాజ్ మిశ్రా, సిఎం అశోక్ గెహ్లాట్ మధ్య కొనసాగుతున్న గొడవ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం (Senior Congress leader P Chidambaram) బీజేపీ పార్టీ మీద, గవర్నర్ల మీద ఫైర్ అయ్యారు. బిజెపి నియమించిన గవర్నర్లు (BJP-appointed governors) రాజ్యాంగ పరిధిలోని లేఖను మరియు ఆత్మను పదేపదే ఉల్లంఘించారని ఆరోపించారు. రాష్ట్రపతి (Ram nath kovind) జోక్యం చేసుకుని రాజస్థాన్ గవర్నర్కు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తారని చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్, తమిళనాడును తాకిన రాజస్థాన్ రాజకీయ సెగలు, రాజ్భవన్ను ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చీఫ్ సహా 60 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
2014 నుండి బిజెపి నియమించిన గవర్నర్లు భారత రాజ్యాంగ వ్యవస్థను (Constitution of India) పదే పదే ఉల్లంఘించారు. ఈ ప్రక్రియలో, వారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, దాని సంప్రదాయాలను మరియు సంప్రదాయాలను తీవ్రంగా దెబ్బతీశారు, ”అని చిదంబరం వర్చువల్ విలేకరుల సమావేశంలో అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ (2016), ఉత్తరాఖండ్ (2016) మరియు కర్ణాటక (2019) - కనీసం మూడు మైలురాయి తీర్పులు వచ్చాయని చిదంబరం చెప్పారు. కరోనాపై చర్చ కోసం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయమన్న సీఎం అశోక్ గెహ్లాట్, మరింత సమాచారం కావాలని కోరిన గవర్నర్, సుప్రీంలో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్న స్పీకర్
"ఈ తీర్పు మరియు చట్ట ప్రకటనలు ఉన్నప్పటికీ, రాజస్థాన్ గవర్నర్ అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయమని రాజస్థాన్ మంత్రుల మండలి యొక్క సంపూర్ణ చెల్లుబాటు అయ్యే అభ్యర్థనను నిలిపివేస్తూనే ఉన్నారని మండి పడ్డారు. ఈ విషయంలో మిశ్రాకు తన స్వంత అభీష్టానుసారం లేదని పేర్కొన్న చిదంబరం, గవర్నర్కు తాను చేస్తున్నది తప్పు అని చెప్పడానికి మరియు అసెంబ్లీ సమావేశానికి పిలవమని కోరడానికి రాష్ట్రపతికి “సంపూర్ణ అధికారం” ఉందని అన్నారు. రాష్ట్రపతి దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజస్తాన్లో నెలకొన్న తాజా రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు.. బీజేపీ కుట్ర చేస్తోందంటూ లేఖ పేర్కొంది. గవర్నర్లను పావుగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తోందని లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. అలాగే రాజస్తాన్లో నెలకొన్న ప్రతిష్టంభన రాజకీయ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని.. వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని రాష్ట్రపతికి ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు తాజాగా హైకోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ పార్టీలోకి ఆరుగురు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎమ్మెల్యేలు విలీనం కావడాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్ను రాజస్థాన్ హైకోర్టు తోసిపుచ్చింది. అంతకుముందు, బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ దాఖలు పిటిషన్పై హైకోర్టు స్పందిస్తూ, అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వుకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా కోర్టుకు అందజేయాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆర్పీ సింగ్ను ఆదేశించింది. ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలతో అధికార కాంగ్రెస్ తన మెజారిటీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోందని మదన్ దిలావర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేల అనర్హతను నిర్ణయించే విషయంలోనూ స్పీకర్ సాచివేత వైఖరిని కూడా ఆయన సవాలు చేశారు. మరోవైపు, విలీనంపై బీజేపీ వేసిన పిటిషన్లో తమను కూడా చేర్చాలని కోరుతూ బీఎస్పీ సైతం హైకోర్టును ఆశ్రయించింది.
గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రవర్తనపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్టు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. సోమవారంనాడు ఫైర్మాంట్ హోటల్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీతో ఆదివారంనాడు తాను మాట్లాడానని, గవర్నర్ ప్రవర్తన గురించి తెలియజేశానని అన్నారు. ఏడు రోజుల క్రితం తాను గవర్నర్కు రాసిన లేఖ గురించి కూడా వివరించినట్టు చెప్పారు. దీనికి ముందు, హోటల్ ఆవరణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి 'ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..రాజ్యాంగాన్ని కాపాడండి' నినాదంతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గెహ్లాట్, పార్టీ నేతలు ఇందులో పాల్గొన్నారు. గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు బయటపడి, రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పటి నుంచి సుమారు రెండు వారాలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హోటల్లోనే ఉంటున్నారు.
(The above story first appeared on LatestLY on Jul 27, 2020 05:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

