2024 భారతదేశం ఎన్నికలు: దేశవ్యాప్తంగా మొదలైన లోక్‌ సభ రెండో దశ పోలింగ్.. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్.. 15.88 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు అవకాశం.. బరిలో రాహుల్ గాంధీ సహా అతిరథులు
Polling (Credits: X)

Newdelhi, Apr 26: లోక్‌ సభ ఎన్నికలు-2024లో (Loksabha Elections 2024) భాగంగా దేశవ్యాప్తంగా రెండో దఫా పోలింగ్ (Second Phase) మొదలైంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ షురూ అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 1,202 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 15.88 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నిజానికి రెండో దశలో 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్‌ లోని బేతుల్‌ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంలో అక్కడ పోలింగ్ రీషెడ్యూల్ అయ్యింది.

RCB Beat SRH by 35 Runs in IPL 2024: హోం గ్రౌండ్ లో స‌న్ రైజ‌ర్స్ ఘోర ప‌రాజ‌యం, ల‌క్ష్య చేధ‌న‌లో చేతులెత్తేసిన ఆరెంజ్ ఆర్మీ, టోర్నీలో రెండో విజ‌యం న‌మోదు చేసిన ఆర్సీబీ

Kallara Lyrical Song Out: కాజల్‌ అగర్వాల్‌ సత్యభామ నుంచి కల్లారా సాంగ్‌ వచ్చేసింది, మే 17న సినిమా విడుదల

పోటీలో అగ్రనాయకులు

ఈ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ నేత తేజస్వి సూర్య, హేమమాలిని తదితరులు పోటీలోఉన్నారు. కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్‌ లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్‌‌లో 8, మధ్యప్రదేశ్‌‌లో 6, అస్సాం, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌‌లలో 3 చొప్పున, మణిపూర్‌, త్రిపుర, జమ్మూకశ్మీర్‌‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన, ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు