Diamond Portrait Of Ratan Tata: 11 వేల వజ్రాలతో రతన్ టాటా చిత్రం.. గుజరాత్ వ్యాపారి అద్భుత నివాళి
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం.. దాతృత్వశీలి రతన్ టాటా ఇటీవలే మరణించారు. ఆయనకు దేశం మెుత్తం బాధతో వీడ్కోలు చెప్పింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ ఆయనకు నివాళి అర్పించారు.
Newdelhi, Oct 14: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, దాతృత్వశీలి రతన్ టాటా (Ratan Tata) ఇటీవలే మరణించారు. ఆయనకు దేశం మెుత్తం బాధతో వీడ్కోలు చెప్పింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ ఆయనకు నివాళి అర్పించారు. ఈ క్రమంలో సూరత్ కు చెందిన ఓ నగల వ్యాపారి సుమారు 11 వేల వజ్రాలతో రతన్ టాటా చిత్రపటాన్ని (Diamond Portrait) తయారు చేసి నివాళులర్పించారు. ఈ ఫోటోలపై స్పందించిన చాలామంది రతన్ టాటాను హృదయపూర్వకంగా స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు.
ఆ కిక్కే వేరప్పా..! ఏపీ మద్యం దుకాణాల టెండర్ల లాటరీ నేడే.. మద్యం దుకాణాలు దక్కేది ఎవరికో??
Here's Video:
View this post on Instagram
ఎవరు చేశారు?
గుజరాత్ లోని సూరత్ కు చెందిన విపుల్ భాయ్ అనే వజ్రాల వ్యాపారి రతన్ టాటాకు వినూత్నంగా నివాళులర్పించాలనుకున్నారు. ఈ క్రమంలో సుమారు 11 వేల వజ్రాలతో రతన్ టాట చిత్రాన్ని రూపొందించారు. స్వతహాగా కళాకారుడైన విపుల్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అమెరికన్ డైమండ్స్ ఉపయోగించారు.
(The above story first appeared on LatestLY on Oct 14, 2024 08:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

