Madhya Pradesh: పెళ్లిరోజు వరుడికి కరోనా, అయినా తాళి కట్టించుకున్న వధువు, పీపీఈ కిట్లు ధరించి ఒక్కటయిన జంట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మధ్యప్రదేశ్లో జరిగిన పెళ్లి
కరోనావైరస్ కల్లోలంలో మధ్యప్రదేశ్ లో జరిగిన పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో ఘటన వివరాల్లోకెళితే.. మధ్య ప్రదేశ్ లోని మాళ్వా ప్రాంతం రట్లం జిల్లాలో పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకున్నాక వరుడికి కరోనా ( Groom Tests Covid Positive in madhya Pradesh) వచ్చింది. అయితేనేమి పెళ్లిని వాయిదా వేయకుండా అనుకున్న ముహర్తానికే పెళ్లి తంతు పూర్తి చేసుకున్నారు.
Bhopal, April 27: కరోనావైరస్ కల్లోలంలో మధ్యప్రదేశ్ లో జరిగిన పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో ఘటన వివరాల్లోకెళితే.. మధ్య ప్రదేశ్ లోని మాళ్వా ప్రాంతం రట్లం జిల్లాలో పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకున్నాక వరుడికి కరోనా ( Groom Tests Covid Positive in madhya Pradesh) వచ్చింది. అయితేనేమి పెళ్లిని వాయిదా వేయకుండా అనుకున్న ముహర్తానికే పెళ్లి తంతు పూర్తి చేసుకున్నారు.
వధువు పెళ్లికి ఒప్పుకోవడంతో పీపీఈ కిట్లు వేసుకుని (Wedding Pheras In PPE) ఇద్దరూ ఒకటయ్యీరు. వధువు, వరుడుతోపాటు మరో ముగ్గురు పూర్తి రక్షణ చర్యలు తీసుకుని వివాహ కార్యక్రమాన్ని ముగించారు. పీపీఈ కిట్లు, పూలదండలతో హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రాట్నం తహశీల్దార్ గార్గ్ అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 19న కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. దీంతో పెళ్లిని ఆపాలని తొలుత ప్రయత్నించారు. కానీ సీనియర్ అధికారులు చొరవ తీసుకుని వినూత్నంగా ఆలోచించారు. కరోనా విస్తరించ కుండా, చాలా తక్కువ మందితో పీపీఈ కిట్లతో సోమవారం పెళ్లి ముచ్చటను కాస్తా ముగించారు ఇరు కుటుంబాల వారు. అయితే ఇక్కడో విశేషంకూడా ఉంది. ప్రస్తుతం కరోనా కాలంలో కోవిడ్ మార్గదర్శకాలను ప్రజలు పాటించేలా ఒక వినూత్న ఐడియాను అధికారులు చేపట్టారు.
Here's Marriage Video
#WATCH | Madhya Pradesh: A couple in Ratlam tied the knot wearing PPE kits as the groom is #COVID19 positive, yesterday. pic.twitter.com/mXlUK2baUh
— ANI (@ANI) April 26, 2021
ఇదిలా ఉంటే కేవలం 10 లేదా అంతకంటే తక్కువ అతిథులతో వివాహం చేసుకోబోయే జంటలకు భీంద్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ (Superintendent of Police Manoj Kumar Singh) బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ నూతన దంపతులకు తన ఇంట్లో రుచికరమైన విందు ఇస్తామని ప్రకటించారు.
అంతేకాదు ఆ జంటలకు మెమెంటోలు ఇస్తామన్నారు.కోవిడ్ మార్గదర్శకాలతో వారిని సురక్షితంగా ప్రభుత్వ వాహనంలో ఇంటికి సాగనంపుతామని కూడా వెల్లడించారు. కాగా కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివాహ కార్యక్రమాలకు గరిష్టంగా 50 మంది అతిథులకు మాత్రమే అనుమతి ఉంది.
(The above story first appeared on LatestLY on Apr 27, 2021 05:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

