అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా విధ్వంసం కొన‌సాగుతోంది. ఇవాళ కూడా బీహార్‌లో యువ‌త చెల‌రేగిపోయారు. కొత్త ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. ఇవాళ నిర‌స‌న‌కారులు బీహార్‌లోని ల‌ఖ్మినియా రైల్వే స్టేష‌న్‌కు నిప్పుపెట్టారు. రైల్వే ట్రాక్‌ల‌ను ధ్వంసం చేసి రైళ్ల‌ను నిలిపివేశారు. భ‌గ‌ల్‌పూర్‌, న్యూఢిల్లీ మ‌ధ్య న‌డిచే విక్ర‌మ్‌శిలా ఎక్స్‌ప్రెస్‌, జ‌మ్మూతావి-గౌహ‌తి ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌కు నిర‌స‌న‌కారులు నిప్పుపెట్టారు. అగ్నిప‌థ్ స్కీమ్‌ను ర‌ద్దు చేయాల‌ని 72 గంట‌ల డెడ్‌లైన్ జారీ చేశారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)