సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో భవనాల కూల్చివేతను ప్రారంభించారు అధికారులు(Secunderabad Railway Station). సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేతలు చేపట్టారు. కళా సంస్కృతికి చిహ్నంగా నిలిచింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కట్టడం(Railway Station Iconic Building).
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నిధులను సైతం విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే పాత కట్టడాలను కూల్చివేసి కొత్త భవనాల నిర్మాణం చేపట్టనున్నారు.
ఇక మరో వార్తను పరిశీలిస్తే రేషన్ కార్డు ఇవ్వడం లేదని ఎమ్మార్వో ఆఫీస్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు . కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామానికి చెందిన సందీప్ గౌడ్ అనే యువకుడు రేషన్ కార్డు ఇవ్వడం లేదని, ఎమ్మార్వో ఆఫీస్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Secunderabad Railway Station Iconic Building Razed for Modernization
#Secunderabad #RailwayStation’s Iconic Building Razed for #Modernization pic.twitter.com/bS7OXgbLgK
— Aadhan Telugu (@AadhanTelugu) February 14, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)