అర్హులైన రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రూ.16,000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. కర్ణాటకలోని బెళగావిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన.. నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా చిన్న, సన్నకారు రైతుల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రధాని మోదీ అన్నారు. మోదీ ప్రభుత్వంలో ప్రతిపైసా ప్రజలదేనని, వారి కోసమే ఖర్చు చేస్తామని చెప్పారు. 2014లో భాజపా తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవసాయం కోసం రూ.25 వేల కోట్లు కేటాయించామన్న మోదీ.. ప్రస్తుతం అది రూ. 1.25 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు.
Here's ANI Tweet
Karnataka | Under PM Kisan Samman Nidhi Yojana, we transferred over Rs 2.5lakh cr to the bank account of farmers in the country. Especially, more than Rs 50,000 cr has been credited to the women farmers: PM Modi in Belagavi
— ANI (@ANI) February 27, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)