UCC: త్వరలో ‘ఉమ్మడి పౌరస్మృతి’.. ఈ సమావేశాల్లోనే టేబుల్‌పైకి ముసాయిదా బిల్లు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదా బిల్లు ఈ వర్షాకాల సమావేశంలో పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

UCC: త్వరలో ‘ఉమ్మడి పౌరస్మృతి’.. ఈ సమావేశాల్లోనే టేబుల్‌పైకి ముసాయిదా బిల్లు
UCC (Credits: Twitter)

Newdelhi, June 30: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ-UCC) ముసాయిదా బిల్లు ఈ వర్షాకాల సమావేశంలో (Monsoon Session) పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. యూసీసీపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు న్యాయ కమిషన్, న్యాయ మంత్రిత్వశాఖతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జులై 3న సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారమే తేల్చి చెప్పారు. సున్నితమైన అంశాలపై ముస్లింలను రెచ్చగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

High Court Delivers Judgment in Telugu: తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం.. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి

Prakasam Horror: పరీక్షలో కాపీ కొట్టి డీబార్ అయిన విద్యార్థి.. పరీక్ష కేంద్రం ప్రిన్సిపల్‌పై కక్ష పెంచుకున్న వైనం.. ఈ క్రమంలో బ్లేడుతో ప్రిన్సిపల్‌ గొంతుకోసేందుకు యత్నం.. ప్రకాశం జిల్లా గిద్దలూరులో షాకింగ్ ఘటన

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 30, 2023 09:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).