హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం దిశగా ఎన్నికల ఫలితాలు సాగుతున్నాయి. 68 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే 16 సీట్లను గెలుచుకుంది. మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. బీజేపీ 13 స్థానాల్లో గెలిచి, 13 స్థానాల్లో ముందంజలో ఉంది. మరో మూడుచోట్ల ఇతరులు గెలుపొందారు. అయితే, ఈ ఎన్నికల్లోనూ హిమాచల్‌ప్రదేశ్‌ ఓటర్లు ఆనవాయితీగా మరోసారి కొనసాగించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ నేతృత్వంలో బీజేపీ  ఓటమి దిశగా పయనిస్తోంది. సెరాజ్‌ స్థానం నుంచి పోటీ చేసిన మాత్రం గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రజల తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. కాసేపట్లో తన రాజీనామాను గవర్నర్‌కు అందజేస్తానని వెల్లడించారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)