Dosa-Sambar : దోసెలో సాంబార్ ఇవ్వని రెస్టారెంట్.. 11 నెలల పాటు న్యాయపోరాటం చేసి గెలుపొందిన లాయర్.. రెస్టారెంట్ కు రూ.3500 జరిమానా విధించిన కోర్టు
ఇదో విచిత్రమైన వార్త. దోసెలో సాంబార్ ఇవ్వని రెస్టారెంట్ కు ఓ లాయర్ చుక్కలు చూపించాడు. వినియోగదారుల కోర్టులో కేసు వేసి మరీ భారీ మూల్యం చెల్లించుకునేలా చేశారు.
Patna, July 14: ఇదో విచిత్రమైన వార్త. దోసెలో (Dosa) సాంబార్ (Sambar) ఇవ్వని రెస్టారెంట్ కు (Restaurant) ఓ లాయర్ చుక్కలు చూపించాడు. వినియోగదారుల కోర్టులో (Court) కేసు వేసి మరీ భారీ మూల్యం చెల్లించుకునేలా చేశారు. బీహార్కు (Bihar) చెందిన మనీష్ పాఠక్ అనే న్యాయవాది రూ.140 పెట్టి ఓ స్పెషల్ మసాలా దోసె పార్శిల్ ఆర్డర్ ఇచ్చారు. కానీ, ఇంటికొచ్చిన పార్శిల్లో దోసె, చట్నీ తప్ప సాంబార్ జాడ కానరాలేదు. దీంతో, ఆయన వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు. 11 నెలల పాటు న్యాయపోరాటం చేశారు. న్యాయస్థానం చివరకు రెస్టారెంట్ నిర్వాహకులదే తప్పని తేల్చి చెప్పింది. అంతేకాకుండా, ఆ రెస్టారెంట్ పై ఏకంగా రూ.3500 జరిమానా విధించింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
In a unique case, a local court in #Bihar has ordered a restaurant owner to submit a fine of Rs 3,500 for not serving #sambar with #dosa.https://t.co/O0TXFcdjMv
— Economic Times (@EconomicTimes) July 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 14, 2023 09:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

