Rs 1,500 for Hugging Trees: చెట్లను కౌగిలించుకునేందుకు రూ.1500 రుసుము.. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకంటూ బెంగళూరులో ఓ కంపెనీ కార్యక్రమం.. విమర్శలు
మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఈ నెల 28న తాము ‘ఫారెస్ట్ బాతింగ్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు బెంగళూరులోని ట్రోవ్ ఎక్స్ పీరియెన్సెస్ అనే కంపెనీ ప్రకటించింది.
Bengaluru, Apr 22: మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఈ నెల 28న తాము ‘ఫారెస్ట్ బాతింగ్’ (Forest Bathing) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు బెంగళూరులోని (Bengaluru) ట్రోవ్ ఎక్స్ పీరియెన్సెస్ అనే కంపెనీ ప్రకటించింది. ఇందులో చెట్లను కౌగిలించుకోవడం, అడవిలో నడవడం వంటివి ఉంటాయని పేర్కొంది. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ఒక్కొక్కరు రూ.1,500 చెల్లించాలని ప్రకటించింది. ఈ ప్రకటన చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మార్కెట్లోకి కొత్త స్కామ్ వచ్చింది.. చెట్లను కౌగిలించుకునేందుకు రూ.1,500 ఏంటి?’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Hugging Trees For Rs 1,500? Ad By Bengaluru Company Shocks Internet https://t.co/KD40LA7uw1 pic.twitter.com/2a5O6Nx8VU
— Roger David (@kunalgrewal993) April 17, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 22, 2024 09:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

