ఓ దుకాణాన్ని ప్రారంభించ‌డానికి వెళ్లిన ఓ పాకిస్థాన్ మంత్రి రిబ్బ‌న్‌ను క‌త్తెర‌తో కాకుండా పళ్ల‌తో కొరికిపారేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ (Goes Viral in Social Media) అవుతోంది. పాక్ మంత్రి తీరుపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా లాహోర్‌లో కొత్త‌గా నిర్మించిన ఓ దుకాణాన్ని ప్రారంభించడానికి పాక్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్ (Fayyaz-ul-Hassan Chohan) వెళ్లారు. దుకాణ ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద క‌ట్టిన‌ రిబ్బన్ ను ఆయ‌న క‌ట్ చేసి లోప‌లికి వెళ్లాల్సి ఉంది. దాని కోసం నిర్వాహ‌కులు క‌త్తెర కూడా తీసుకొచ్చారు. అయితే, ఆ క‌త్తెర‌ పదునుగా లేదు. ఎంత‌గా ట్రై చేసినా అది క‌ట్ కాలేదు. దీంతో ఆ మంత్రికి చిర్రెత్తుకొచ్చింది. షాపు యజమానిని తిట్టుకుంటూ ప‌ళ్ల‌తోనే రిబ్బ‌న్ ను పరపరా క‌ట్ చేసిపారేశారు. అది చూసి, అక్క‌డున్న వారు మాత్రం న‌వ్వు ఆపుకోలేక‌పోయారు. మరోపక్క, ఆయ‌న తీరుపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)