IPL 2022: సన్రైజర్స్ హైదరాబాద్కు ఊహించని షాక్, స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్ కేన్ విలియమ్సన్
సన్రైజర్స్ హైదరాబాద్కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్.. మరో కీలక మ్యాచ్ మిగిలి ఉండగానే స్వదేశానికి బయల్దేరాడు. కేన్ సతీమణి సారా రహీం రెండో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేన్ ఐపీఎల్ బయో బబుల్ని వీడి స్వదేశానికి పయనమయ్యాడు. దీంతో కేన్ మే 22న పంజాబ్ కింగ్స్తో జరిగే కీలకమైన మ్యాచ్కు దూరమయ్యాడు. కేన్ గైర్హాజరీలో భువనేశ్వర్ కుమార్ లేదా నికోలస్ పూరన్ ఆరెంజ్ ఆర్మీని ముందుండి నడిపించనున్నారు.
పంజాబ్తో మ్యాచ్కు విలియమ్సన్ అందుబాటులో ఉండడన్న విషయాన్ని సన్రైజర్స్ యాజమాన్యం ట్విటర్ వేదికగా వెల్లడించింది. విలియమ్సన్ దంపతులకు 2020 డిసెంబర్లో అమ్మాయి జన్మించింది.
ఐపీఎల్ 2022 సీజన్లో సన్రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు మిగతా మ్యాచ్లపై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఢిల్లీ, ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తమతమ చివరి మ్యాచ్ల్లో ఓడి, సన్రైజర్స్.. పంజాబ్ కింగ్స్పై భారీ తేడాతో గెలిస్తే ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్కు చేరే అవకాశం ఉంది.
𝑶𝑭𝑭𝑰𝑪𝑰𝑨𝑳 𝑼𝑷𝑫𝑨𝑻𝑬:
Our skipper Kane Williamson is flying back to New Zealand, to usher in the latest addition to his family. 🧡
Here's everyone at the #Riser camp wishing Kane Williamson and his wife a safe delivery and a lot of happiness!#OrangeArmy #ReadyToRise pic.twitter.com/3CFbvN60r4
— SunRisers Hyderabad (@SunRisers) May 18, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 19, 2022 11:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

