Leopard at Tirumala: తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం.. ఎలుగు కదలికలు కూడా
తిరుమల మెట్లమార్గంలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. నడకదారిలో ఉన్న శ్రీ నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి.
Tirumala, Dec 30: తిరుమల (Tirumala) మెట్లమార్గంలో చిరుత (Leopard) సంచారం మరోసారి కలకలం రేపింది. నడకదారిలో (Walkway) ఉన్న శ్రీ నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి. డిసెంబర్ 13, 26 తేదీల్లో ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగు కదలికలను అధికారులు గుర్తించారు. దీంతో టీటీడీ అప్రమత్తమయింది. తిరుమలకు నడకమార్గంలో వెళ్లే భక్తులకు పలు సూచనలు చేసింది. అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని సూచించారు. గతంలో అలిపిరి నడక మార్గంలో చిరుతలు సంచరించిన విషయం తెలిసిందే.
https://t.co/BOyR0xe0hs #Tirumala తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత కలకలం.. భక్తులు అలెర్ట్ #Walkway #alipiri #Leopard #TTD
— Webdunia Telugu (@WebduniaTelugu) December 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 30, 2023 10:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

