మినీ మేడారం జాతర వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. అర్థరాత్రి వనదేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు సీతక్క(Seethakka At Mini Medaram Jatara). అమ్మల గద్దెలపై మొక్కులు చెల్లించుకుని, రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించే ఈ పవిత్ర జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు సీతక్క(Seethakka).
13న సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పసుపు కుంకుమతో అమ్మవార్లను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు(Mini Medaram Jatara). ఫిబ్రవరి 14న భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వీలు కల్పించనున్నారు. 15న అమ్మవార్లకు ఆలయ పూజారులు గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. దీంతో మండ మెలిగే పండుగ ఘట్టం ముగుస్తుంది.
మినీ జాతర(Mini Medaram 2025) నేపథ్యంలో ఆర్టీసీ వివిధ డిపోల నుండి 200 బస్సులు నడిపించనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా తొమ్మిది డిపోలు ఉండగా, అవసరాన్ని బట్టి ఆయా డిపోలన్నింటి నుంచి బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.110 ఛార్జీ చేయనున్నారు.
Minister Seethakka at Mini Medaram Fair celebrations
మినీ మేడారం జాతర వేడుకల్లో మంత్రి సీతక్క
అర్థరాత్రి వనదేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న సీతక్క
అమ్మల గద్దెలపై మొక్కులు చెల్లించుకుని, రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్న మంత్రి
సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించే ఈ పవిత్ర జాతరలో పాల్గొనడం చాలా… pic.twitter.com/4krrofqh6W
— BIG TV Breaking News (@bigtvtelugu) February 13, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)