Telangana Half Day Schools: ఎండల తీవ్రత.. ఒంటిపూట బడులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, స్కూల్ టైమింగ్స్లో మార్పు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా మార్చి మొదటివారంలోనే ఎండలు దంచికొడుతుండగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా మార్చి మొదటివారంలోనే ఎండలు దంచికొడుతుండగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది(Telangana Half Day Schools).
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులను నిర్వహిస్తారు. అలాగే ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి( Half Day Schools).
ఇక పదో తరగతి పరీక్షా జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం పూట స్కూళ్లను నిర్వహిస్తారు. ఇప్పటికే రంజాన్ పండుగ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ స్కూళ్లకు విద్యార్ధులకు ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి.
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 06, 2025 01:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

