ఇంట‌ర్నెట్ దిగ్గజం గూగుల్‌(Google)పై కాంపిటీష‌న్ క‌మీష‌న్ ఆఫ్ ఇండియా(CCI) సుమారు రూ.1337 కోట్ల జ‌రిమానా విధించింది. అయితే ఆ జ‌రిమానాను 30 రోజుల్లోగా డిపాజిట్(deposit) చేయాల‌ని నేష‌న‌ల్ కంపెనీ లా అపిల్లేట్ ట్రిబ్యున‌ల్(Natinal Company Law Appellate Tribunal) ఇవాళ తీర్పునిచ్చింది. ఇద్ద‌రు జ‌డ్జిల ధ‌ర్మాస‌నం ఈ తీర్పును వెలువ‌రించింది. త‌మ ఆదేశాల‌ను పాటించాల‌ని, 30 రోజుల్లోగా ఆ అమౌంట్‌ను డిపాజిట్ చేయాల‌ని గూగుల్‌కు ఎన్‌సీఎల్ఏటీ ఆదేశించింది. ఆండ్రాయిడ్ మొబైల్(Android mobiles) డివైస్‌ల‌ విష‌యంలో గూగుల్ సంస్థ‌కు గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో సీసీఐ జ‌రిమానా విధించిన విష‌యం తెలిసిందే. అక్ర‌మ ప‌ద్ధ‌తుల్లో సాగే వ్యాపారాన్ని ఆపాల‌ని గూగుల్ సంస్థ‌ను హెచ్చ‌రించింది. సీసీఐ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ గూగుల్ సంస్థ ఎన్సీఎల్ఏటీ కోర్టులో అప్పీల్ చేసుకున్న‌ది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)