Turkey Earthquake: టర్కీ, సిరియా భూకంప బాధితులకు అండగా భారత్, అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్నేహ హస్తం అందించిన ప్రధాని మోదీ
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ మధ్యాహ్నం మరోసారి టర్కీలో భారీ భూకంపం సంభవించింది. టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం కారణంగా భారీ విధ్వంసం చోటుచేసుకోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ మధ్యాహ్నం మరోసారి టర్కీలో భారీ భూకంపం సంభవించింది. టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం కారణంగా భారీ విధ్వంసం చోటుచేసుకోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భూకంప బాధిత దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్నేహ హస్తం చాచారు. ప్రధాని మోదీ ప్రకటన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించింది. వైద్యబృందాలు, ఔషధాలను కూడా పంపించింది.
Here's Update
‘Anguished by the loss of lives’: PM Modi condoles deaths in Turkey, Syria after quake#TurkeyEarthquakehttps://t.co/oJYda9fBcz
— Breaking News (@feeds24x7) February 6, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 06, 2023 06:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

