IND vs NZ 1st T20I: న్యూజీలాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి, విఫలమైన భారత బ్యాటర్లు, ఆఖర్లో మెరుపులు మెరిపించిన న్యూజీలాండ్ బ్యాటర్ డారిల్‌ మిచెల్‌
India lose a T20I (Photo-Twitter)

రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.సూర్యకుమార్‌ యాదవ్‌ 47 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వాషింగ్టన్‌ సుందర్‌ 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతావారు విఫలం కావడంతో టీమిండియా ఓటమి దిశగా పయనించింది. కివీస్‌ బౌలర్లలో మిచెల్‌ సాంట్నర్‌ , మైకెల్‌ బ్రాస్‌వెల్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. జాకబ్‌ డఫీ, లోకీ ఫెర్గూసన్‌, ఇష్‌ సోదీలు తలా ఒక వికెట్‌ తీశారు.

ఐసీసీ అండర్‌-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ వుమెన్స్ ,సెమీ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ వుమెన్స్‌పై ఘన విజయం

తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డారిల్‌ మిచెల్‌(30 బంతుల్లో 59,3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆఖర్లో మెరుపులు మెరిపించగా.. కాన్వే(52 పరుగులు) రాణించాడు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, శివమ్‌ మావిలు తలా ఒక వికెట్‌ తీశారు.