India vs Sri Lanka, 1st T20: టీమిండియా-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్... 43 పరుగుల తేడాతో శ్రీలంకపై టీమిండియా అద్భుత విజయం
శ్రీలంకతో టీ20 సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా గెలుపుతో బోణీ కొట్టింది. పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది.
Newdelhi, July 28: శ్రీలంకతో (Srilanka) టీ20 సిరీస్ (T20) లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా గెలుపుతో బోణీ కొట్టింది. పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. 214 పరుగుల భారీ లక్ష్యఛేదనను దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది.
టీమిండియా ముందంజ
తాజా విజయంతో టీమిండియా 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆదివారం ఇదే మైదానంలో జరగనుంది. 58 పరుగులతో సూర్యకుమార్, 49 రన్స్ తో పంత్ రాణించారు. పతిరణకు నాలుగు వికెట్లు లభించాయి.
(The above story first appeared on LatestLY on Jul 28, 2024 09:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

