T20 World Cup 2022: సెమీస్కు చేరిన తొలి జట్టుగా న్యూజీలాండ్ ముందడుగు, 35 పరుగుల తేడాతో ఐర్లాండ్ను మట్టి కరిపించిన కివీస్
టీ20 ప్రపంచకప్(సూపర్-12)లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. గ్రూపు-1 నుంచి సెమీస్కు చేరే తొలి జట్టుగా న్యూజిలాండ్ ముందడుగు వేసింది. గ్రూపు-1 నుంచి పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్కు +2.113 రన్ రేట్ ఉంది.
టీ20 ప్రపంచకప్(సూపర్-12)లో భాగంగా ఐర్లాండ్తో (Ireland) జరిగిన మ్యాచ్లో 35 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. గ్రూపు-1 నుంచి సెమీస్కు చేరే తొలి జట్టుగా న్యూజిలాండ్ ముందడుగు వేసింది. గ్రూపు-1 నుంచి పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్కు (New Zealand) +2.113 రన్ రేట్ ఉంది.
ఇక మ్యాచ్లో (T20 World Cup 2022) తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ విలియమ్సన్ 61 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అలెన్(32), మిచెల్(31) పరుగులతో రాణించారు. ఐరీష్ బౌలర్లలో లిటిల్ మూడు, డెలానీ, అడైర్ తలా వికెట్ సాధించారు.
186 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్కు ఓపెనర్లు స్టిర్లింగ్, బాల్బిర్నీ అద్భతమైన శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ ఔటయ్యక వరుస క్రమంలో ఐర్లాండ్ వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్, సోధి, సౌథీ తలా వికెట్ సాధించారు.
(The above story first appeared on LatestLY on Nov 04, 2022 02:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

